ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఇబ్రహీంపట్నంలో జగనన్న పాల వెల్లువ పధకమునకు సంభందించి ఏ యంసియూ పరికరాల నిర్వహణపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో విజయవాడ సబ్ కలెక్టర్ జి.సూర్య సాయి ప్రవీణ్ చంద్ పాల్గొన్నారు. జగనన్న పాల వెల్లువ పధకము లో భాగంగా ఆటోమాటిక్ మిల్క్ కలెక్షన్ పరికరము గురించి కార్యదర్సి, చైర్మన్, వైస్ చైర్మన్ మరియు సచివాలయముల వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లకు డిజిటల్ అసిస్టెంట్ లకు శిక్షణా కార్యక్రమము జరిగినది. ఈ సందర్భంగా జగనన్న పాలవెల్లువ కింద అందే ప్రయోజనాలను ఆయన వివరించారు. ఈ కార్యక్రమములో డయిరీ డెవలప్మెంట్ ఫెడరేషన్ జాయింట్ రిజిస్ట్రారర్ టి. ప్రవీణ్ ,పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News