Breaking News

శ్రీశైలం శివరాత్రి వేడుకలకు గవర్నర్ కు ఆహ్వానం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానంలో జరిగే మహా శివరాత్రి వేడుకలకు హాజరై, స్వామి ఆశీర్వచనం అందుకోవాలని శ్రీశైలం దేవస్థానం ప్రతినిధులు ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ కు ఆహ్వానం అందించారు. దేవస్థానం ఈవో లవన్న, ఇతర అధికారులు శుక్రవారం గవర్నర్ ను రాజ్ భవన్ లో కలిసి ఆహ్వాన పత్రికను అందచేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, వేదపండితులు గౌరవ గవర్నర్ ను ఆశీర్వదించి ప్రసాదాలు, దేవతామూర్తుల చిత్ర పటాలను అందజేశారు. కార్యక్రమంలో గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఉత్తరాంధ్రకు మకుటాయమానం.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం: మంత్రి కందుల దుర్గేష్

-ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ ప్రారంభోత్సవం.. ఈ సందర్భంగా ఏర్పాట్లను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *