Breaking News

ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో పనిచేయాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చిత్తశుద్ధితో పనిచేసి పశ్చిమ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజవర్గంగా తీర్చిదిద్దాలని ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. గురువారం తాడిగడప లోని తమ కార్యాలయంలో ఎన్డీఏ కూటమి కార్పొరేటర్లతో ఎమ్మెల్యే సుజనా చౌదరి సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు డివిజన్లలో పర్యటించి సమస్యలను పరిష్కరించాలన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు నిరంతరం కృషి చేయాలని తెలిపారు. పశ్చిమ లోని సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే సుజనా చౌదరి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు ఉమ్మడి చంటి, బుల్లా విజయ్, గుడివాడ నరేంద్ర రాఘవ, హర్షద్, అప్పాజీ రావు, మైలవరపు రత్నకుమారి, అత్తులూరి ఆదిలక్ష్మి, మైలవరపు మాధురి లావణ్య, కూటమినేతలు మైలవరపు దుర్గారావు, పైలా సురేష్, మైలవరపు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *