రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గురువారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత వారితో కలెక్టరు పి ప్రశాంతి స్ధానిక జిల్లా కోర్టు కార్యాలయంలో సమావేశం అవ్వడం జరిగింది. తొలుత జిల్లా కోర్టు ఆవరణలో ప్రధాన న్యాయమూర్తి ఛాంబర్ లో కలెక్టరు పి ప్రశాంతి మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చేం అందచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి జిల్లా ప్రధాన న్యాయమూర్తి తో జిల్లాలో చేపడుతున్నవివిధ అంశాలను వివరించడం జరిగింది. జిల్లాలో నిర్మాణ దశలో కోర్టు భవనాలు, తదితర అంశాలపై చర్చించడం ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత కి వివరించడం జరిగింది.
Prajavartha Online Telugu News