Breaking News

Tag Archives: hyderabad

ఉత్పత్తి ధరలకే చేనేత వస్త్రాల విక్రయం

-ఆంధ్రప్రదేశ్ చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి సునీత -శ్రీనగర్ కాలనీ సత్యసాయి నిగమాగమంలో నవంబరు 2 వరకు చేనేత ప్రదర్శన హైదరాబాద్ ,నేటి పత్రిక ప్రజావార్త : ఉత్పత్తి ధరలకే అందిస్తున్న చేనేత వస్త్రాలను ఆదరించి, నేత కార్మికులకు సహకరించాలని ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత అన్నారు. నగరంలోని శ్రీనగర్ కాలనీ సత్యసాయి నిగమాగమంలో ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళి శాఖ, ఆప్కో సంయిక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను శుక్రవారం సునీత ప్రారంభించారు. నవంబరు రెండవ …

Read More »

బీసీవై ఎన్నికల శంఖారావం!

-తెలంగాణలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన రామచంద్ర యాదవ్ -నవంబర్ 1న పార్టీ మేనిఫెస్టో.. అభ్యర్ధుల ప్రకటన విడుదల హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : వివిధ రాజకీయ పార్టీల్లోని అసంతృప్తులుగా ఉన్న నాయకులు, కార్యకర్తలు ఎవరైనా తమ పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చి రావాలనుకుంటే భారత చైతన్య యువజన (బీసీవై) పార్టీ ఆహ్వానిస్తుందని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు బొడే రామచంద్రయాదవ్ తెలిపారు. తెలంగాణ ఎన్నికల సంగ్రామంలోకి దిగేందుకు బీసీవై పార్టీ సిద్దమైంది. హైదరాబాద్ జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 70 లో జర్నలిస్ట్ కాలనీ …

Read More »

ఇండోర్‌లో 2023 సెప్టెంబర్ 26-27 తేదీల్లో ఇండియా స్మార్ట్ సిటీస్ 2023 సదస్సు

-ఇండియా స్మార్ట్ సిటీస్ అవార్డు పోటీ (ఐఎస్ఏసి) 2022 విజేతలను సన్మానించనున్న రాష్ట్రపతి హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : మధ్యప్రదేశ్‌లో ఇండోర్‌లో 2023 సెప్టెంబర్ 26-27 తేదీల్లో ఇండియా స్మార్ట్ సిటీస్ 2023 సదస్సును కేంద్ర ప్రభుత్వ గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. ఇండోర్‌లోని బ్రిలియంట్ కన్వెన్షన్ సెంటర్‌లో సదస్సు జరుగుతుంది. సదస్సులో దేశం వివిధ ప్రాంతాలకు చెందిన మొత్తం 100 స్మార్ట్ సిటీలు పాల్గొంటాయి. వినూత్న ఆవిష్కరణల ద్వారా పట్టణ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్న 100 …

Read More »

దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ‘వీరుల’కు నివాళులు అర్పించేందుకు ‘మేరీ మాటి మేరా దేశ్’ ప్రచారం

-గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు దేశవ్యాప్తంగా జన భాగీధారి కార్యక్రమాలు నిర్వహణ -గ్రామ పంచాయతీల్లో శిలాఫలకాలు (స్మారక ఫలకాలు) ఏర్పాటు -అమృత వాటిక రూపకల్పన కోసం దేశంలోని మూలమూలల నుంచి మట్టిని దిల్లీకి తీసుకురావడానికి అమృత కలశ యాత్ర హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : భారత ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ, ఇటీవలి ‘మన్ కీ బాత్’లో, ‘మేరీ మాటీ మేరా దేశ్’ ప్రచారాన్ని ప్రకటించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీర స్వాతంత్ర్య సమరయోధులను, వారి ధైర్యసాహసాలను గౌరవించడం …

Read More »

ప్రఖ్యాత రోబోటిక్ బేరియాట్రిక్ అండ్ గ్యాస్ట్రో సర్జన్ డాక్టర్ గొర్తి గణేష్ కు ప్రతిష్టాత్మక పురస్కారం

-ఎఫ్టీపీసీ ఇండియా, స్టేట్ ఐకాన్స్ ఫోరం ఆధ్వర్యంలో హెల్త్ అండ్ మెడికేర్ అచీవ్మెంట్ అవార్డు – 2023 ప్రదానం -యూ ఎస్ ఏ, యూ కే, ఇండియా లో ఫెలోషిప్స్ సాధించి మూడు దేశాలలో రోబోటిక్ సర్జరీ ట్రైనింగ్ పొందిన గణేష్ గొర్తి -డాక్టర్ గణేష్ కు అవార్డును అందజేసిన బాలీవుడ్ నటి దేబలినా దత్తా హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : ప్రఖ్యాత రోబోటిక్ బేరియాట్రిక్, గ్యాస్ట్రో సర్జన్ డాక్టర్ గొర్తి గణేష్ కు ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. కాంటినెంటల్ హాస్పిటల్ ద్వారా …

Read More »

తెలుగు భాషా పరిరక్షకులు డా.మండలి బుద్ధప్రసాద్ కి, కిన్నెర..ఎన్టీఆర్ భాషా సేవా పురస్కారం

-మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు చే బహూకరణ హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు భాషా పరిరక్షకులు, మాజీ ఉపసభాపతి డా.మండలి బుద్ధప్రసాద్ “కిన్నెర..ఎన్టీఆర్ భాషా సేవా పురస్కారాన్ని” అందుకున్నారు. కిన్నెర ఆర్ట్ థియేటర్స్..నృత్య కిన్నెర సంస్థ ఆధ్వర్యంలో శక పురుషులు, పూర్వ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డా.ఎన్.టి.రామారావు శత జయంతి మహోత్సవాల ముగింపు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ పూర్వ ఉప సభాపతి డా.మండలి బుద్ధప్రసాద్ కి కిన్నెర..ఎన్టీఆర్ భాషా సేవా పురస్కారాన్ని బహూకరించారు. సంస్థ అధ్యక్ష కార్యదర్సులు డా.ఆర్.ప్రభాకరరావు, మద్దాలి రఘురామ్ …

Read More »

జనాకర్షణ కాదు…. జనహిత పథకాలకు పెద్ద పీట వేయాలి – ప్రజలకు ముప్పవరపు వెంకయ్యనాయుడు హితవు

-ప్రతిది ఉచితం అనే పరిస్థితి మారి సింహభాగం నిధులు విద్య, వైద్య రంగాలకు కేటాయించాలి -జ్ఞాన సముపార్జన, నైపుణ్య శిక్షణ పేదరికాన్ని పారద్రోలే మార్గాలు; విద్యలో నైపుణ్య శిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి -పేదలకు ఉచిత వైద్య సదుపాయాలు అందించేందుకు కృషి చేయాలి, ప్రాధాన్యత ఇవ్వాలి -పర్యావరణాన్ని విస్మరించటం మానవాళి వినాశనానికి దారి తీస్తుంది, ఇప్పటికే ఆ ప్రతికూలతలు మనం చూస్తున్నాం -పర్యావరణ పరిరక్షణకు ప్రజలు కృషి చేయటంతో పాటు, జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి -స్వర్ణభారత్ ట్రస్ట్ హైదరాబాద్ చాప్టర్ లో ఉచిత …

Read More »

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నివాసంలో టీడీపీపీ సమావేశం జరిగింది. సమావేశానికి ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్, కింజరాపు రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో…పార్లమెంట్ లో ప్రస్తావించాల్సిన రాష్ట్ర సమస్యలపై పార్టీ అధినేతతో ఎంపీలు చర్చించారు. విభజన సమస్యలు, పోలవరం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, జీవో నెంబర్ 1, లా అండ్ ఆర్డర్ పరిస్థితి వంటి అంశాలపై పార్లమెంట్ లో మాట్లాడాలని చంద్రబాబు …

Read More »

వృద్దులకు పండ్ల పంపిణీ

హైదరాబాద్ , నేటి పత్రిక ప్రజావార్త : విశ్రాంత పోలీసు ఉద్యోగి స్వర్గీయ నీల వెంకయ్య జ్ఞాపకర్ధం ఆదివారం హైదరాబాద్ కూకట్ పల్లి లోని సహృదయ ఓల్డ్ ఏజ్ హోమ్ లోని వృద్ధులకు పండ్లు, అల్పాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హోమ్ నిర్వాహకులు వెంకయ్య సేవలను కొనియాడారు. కార్యక్రమంలో వెంకయ్య భార్య విశ్రాంత ఉపాధ్యాయని సువార్త, కుమారుడు కోటేశ్వరరావు, అరుణకుమారి, మనుమడు జోయల్ సుధాకర్, వెన్నెల, కొటేశ్వరారావు మిత్రులు కనపర్తి రత్నాకర్, సత్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Read More »