Breaking News

Tag Archives: hyderabad

కృష్ణ మరణం పట్ల గవర్నర్ సంతాపం

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : ప్రముఖ చలన చిత్ర నటుడు, నిర్మాత ఘట్టమనేని శివరామ కృష్ణమూర్తి (కృష్ణ) 79 మరణం పట్ల ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరి చందన్ సంతాపం ప్రకటించారు. నటుడుగా, నిర్మాతగా, దర్శకునిగా, చిత్ర నిర్మాణ సంస్థ అధినేతగా, తెలుగు సినిమా రంగానికి ఐదు దశాబ్దాలపాటు కృష్ణ అందించిన సేవలు మరువలేనివన్నారు. 350 పైగా సినిమాల్లో నటించి, సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన కృష్ణ మృతి తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటని …

Read More »

జనసేన ‘కౌలు రైతు భరోసా యాత్ర’కు ఎన్.ఆర్.ఐ. జనసేన ఆస్ట్రేలియా బృందం విరాళం

-పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి రూ. 25 లక్షల చెక్ అందించిన ఎన్.ఆర్.ఐ ప్రతినిధులు హైదరాబాద్, నేటి పత్రిక ప్రజా వార్త : జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కౌలు రైతు భరోసా యాత్ర’కు ఎన్.ఆర్.ఐ. జనసేన ఆస్ట్రేలియా బృందం రూ. 25 లక్షలు విరాళం అందించింది. ఈ మొత్తాన్ని ఎన్.ఆర్.ఐ. బృందం ప్రతినిధులు హైదరాబాద్ పార్టీ కేంద్ర కార్యాలయంలో అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ ని బుధవారం కలిసి అందజేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “అన్నం పెట్టే రైతన్నలను ఆదుకోవాలన్న సదుద్దేశంతో …

Read More »

సాంబశివ ఆలయ పునర్నిర్మాణం సందర్భంగా ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ, ఎమ్మెల్యే

ఓదెల , నేటి పత్రిక ప్రజావార్త : పురాతన సాంబశివ ఆలయ పునర్నిర్మాణ పనులను ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మరియు ఎంపీ వెంకటేష్ నేత తో కలిసి ప్రారంభించారు. బుధవారం ఓదెల మండలం కొలనూర్ గ్రామంలో ఎమ్మెల్యే కృషి తో రూ, 48 లక్షల రూపాయలతో నిర్మించ తలపెట్టిన సాంబ శివాలయ పునర్నిర్మాణ పనులను ప్రారంభించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ నేత  మాట్లాడుతూ తనవంతు సహాయంగా తన ఎంపీ నిధుల నుండి …

Read More »

మంత్రి ఆర్.కే.రోజాని కలిసిన కామన్వెల్త్ బంగారు పతక విజేత పి.వి.సింధు…

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త: హైదరాబాద్ నోవేటెల్ లో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక క్రీడలు మరియు యువజన సర్వీసులు శాఖా మంత్రి ఆర్.కే.రోజాని మర్యాదపూర్వకంగా కామన్వెల్త్ బంగారు పతక విజేత పి.వి.సింధు కలిసారు. కామన్వెల్త్ క్రీడలు 2022 మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ ఫైనల్లో విజేతగా నిలిచిన పివి సింధు కుటుంబ సమేతంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక క్రీడలు మరియు యువజన సర్వీసుల శాఖా మంత్రి శ్రీమతి ఆర్.కే రోజానీ హైదరాబాద్ నోవెటేల్ లో కలిశారు. అనంతరం మంత్రి రోజా కుటుంబ సభ్యులు, సింధు …

Read More »

ఘనంగా కేశినేని నాని కుమార్తె శ్వేత నిశ్చితార్థ వేడుక

హైద‌రాబాద్‌, నేటి పత్రిక ప్రజావార్త : విజ‌య‌వాడ పార్ల‌మెంట్ స‌భ్యులు కేశినేని శ్రీనివాస్‌(నాని) ద్వితీయ కుమార్తె శ్వేత నిశ్చితార్థ వేడుక హైద‌రాబాద్‌లోని తాజ్ కృష్ణ హోట‌ల్‌లో ఆదివారం ఘనంగా జ‌రిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో డిప్యూటి స్పీకర్‌గా పదవీ బాధ్యతలు నిర్వహించిన కాజా రామనాధం మనుమడు కాజా రఘుతో త్వ‌ర‌లో వివాహం జ‌రుగుతుంద‌ని కేశినేని నాని తెలిపారు. కేశినేని శ్వేత‌, ర‌ఘుల నిశ్చితార్థ వేడుక‌కు తెలుగు రాష్ట్రాల రాజ‌కీయ, వ్యాపార ప్ర‌ముఖులు హాజ‌రై చిరంజీవుల‌ను ఆశీర్వ‌దించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు …

Read More »

మహానంది జాతీయ పురస్కారం అందుకున్న ఉప్పరపల్లి బంగార్రాజు

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు వెలుగు సాహితీ వేదిక ఆధ్వర్యంలో తెలంగాణ రాష్టం లో రాజన్న సిరిసిల్ల జిల్లా లో దక్షిణ కాశీ గా పేరొందిన వేములవాడ లో మహానంది జాతీయ పురస్కారాల కార్యక్రమం చాలా వేడుక గా జరిగింది. తెలుగు రాష్ట్రాలలో వివిధ రంగాలలో బహుముఖ ప్రజ్ఞ కనబర్చిన ప్రతిభావంతులైన వ్యక్తులకు మహానంది పురస్కారం అందజేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి విశాఖపట్నానికి చెందిన ఉప్పరపల్లి బంగార్రాజు కూడా ఉన్నారు. చిరకాలం గా చిత్రకళ లో విశేష ప్రతిభను కనబర్చినందుకు …

Read More »

జన్యుపరమైన వ్యాధుల భారాన్ని తగ్గించటంపై మరింత దృష్టి సారించాలి – ఉపరాష్ట్రపతి

-సరైన అవగాహన లేకపోవడమే తలసీమియా, సికిల్ సెల్ అనీమియా వంటి వ్యాధుల నివారణకు అడ్డంకిగా మారాయి -ఈ సమస్యల పరిష్కారానికి అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు కృషిచేయాలి -గ్రామీణ భారతంలో వైద్యుల కొరతను అధిగమించేందుకు యువ వైద్యులకు గ్రామీణ ప్రాంతాల్లో సేవలను తప్పనిసరి చేయాలని సూచన -తలసీమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్త మార్పిడి కేంద్రాన్ని ప్రారంభించిన ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : తలసీమియా, సికిల్ సెల్ అనీమియా …

Read More »

ప్రపంచ శిఖరాల అధిరోహణే ధ్యేయం : అన్వితా రెడ్డి

-హైదరాబాద్ లో ఘన స్వాగతం పలికిన ఎవరెస్టు స్పాన్సర్ అన్విత గ్రూప్ హైదరాబాద్‌, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచంలోని అన్ని ఖండాలలో ఎత్తైన పర్వత శిఖరాలను అధిరోహించటమే తన ముందున్న ప్రధాన ద్యేయమని పర్వతారోహకురాలు అన్వితా రెడ్డి అన్నారు. ఎవరెస్టు పర్వతాన్ని దిగ్విజయంగా అధిరోహించిన తదుపరి హైదరాబాద్ చేరుకున్న అమెను స్పాన్సర్స్ గా వ్యవహరించిన అన్వితా గ్రూపు అధినేత బొప్పన అచ్యుతరావు బుధవారం మీడియాకు పరిచయం చేసారు. హోటల్ మెర్య్కూరిలో ఏర్పాటు చేసిన సమావేశంలో అన్వితా మీడియాతో తన అనుభవాలను పంచుకున్నారు. ఈ …

Read More »

జనసేన క్రీయాశీలక సభ్యుడి కుటుంబానికి పవన్ కళ్యాణ్ పరామర్శ

-కడియం శ్రీనివాసరావు తల్లికి రూ.5 లక్షల బీమా చెక్కు కోదాడ, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ క్రీయాశీలక సభ్యుడు, పార్టీ కోసం పని చేసిన జన సైనికుడు కడియం శ్రీనివాసరావు ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కోదాడలో నివాసముంటున్న ఆయన కుటుంబాన్ని అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పరామర్శించారు. కడియం శ్రీనివాసరావు తల్లి లక్షమ్మ కి జనసేన పార్టీ ప్రవేశపెట్టిన కీయాశీలక సభ్యత్వం ప్రమాద బీమా పథకం నుంచి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఆ కుటుంబానికి …

Read More »

దిక్సూచిలా… జనసేన ప్రస్థానం పుస్తక సంకలనాలు…

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : 2014 మార్చి 14 జనసేన పార్టీ ఆవిర్భావ సభ నుంచి 2022 మార్చి 14న ఇప్పటంలో నిర్వహించిన ఆవిర్భావ సభ వరకూ జనసేన అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగాలు, వెల్లడించిన అభిప్రాయాలను పుస్తక రూపంలో సిద్ధం చేసింది పార్టీ మీడియా విభాగం. ఏడు వాల్యూమ్స్ లో ఉన్న ఈ పుస్తకాలను గురువారం సాయంత్రం హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ కి అందచేశారు. ఆయన మాట్లాడుతూ “ఈ పుస్తకాలు నాకు ఎంతో ఆశ్చ్యర్యాన్ని, ఆనందాన్ని కలిగించాయి. పార్టీ …

Read More »