Breaking News

Tag Archives: Rājamahēndravaraṁ

బుధవారం అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మరియు జిల్లా వైద్య విభాగం సంయుక్త ఆధ్వర్యంలో కోటిపల్లి బస్టాండ్ సమీపంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల నందు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ . కె. ప్రత్యూష కుమారి “పోక్సో చట్టం, 2012” “బాల్య వివాహ నిషేధ చట్టం, 2006” మొదలగు చట్టాల పై అవగాహన …

Read More »

ఇస్రో ఉద్యోగాల్లో ప్రవేశం కోసం కెరీర్ గైడెన్స్ ఉండాలి

-పాఠ్యాంశాల్లో అంతరిక్ష విజ్ఞానం చేర్చాలి : – జెసి తేజ్ భరత్ -ఘనంగా ముగిసిన ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఇస్రోలో ఉద్యోగాల్లో చేరడానికి అనువుగా కెరీర్ గైడెన్స్ రూపొందించడంతో పాటు అంతరిక్ష విజ్ఞానం గురించి విస్తృతంగా పాఠ్యాంశాల్లో చేర్చాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ అభిప్రాయపడ్డారు.ఆ దిశగా ఇస్రో కృషి చేస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసారు.ఈనెల 6వ తేదీ నుంచి స్థానిక శ్రీ వేంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో నిర్వహిస్తున్న ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు ఆదివారం …

Read More »

అక్టోబర్ 10 వ తేదీ జాబ్ మేళా

-జిల్లా ఉపాధి కల్పన అధికారి కార్యాలయంలో – కె. హరిచంద్ర ప్రసాద్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 10-10-2023 వ తేదీ మంగళవారం రోజున జిల్లా ఉపాధి కార్యాలయం, SBI బ్యాంకు సమీపంలో, తాడితోట, రాజమహేంద్రవరం, తూర్పు గోదావరి జిల్లా – 533101 నందు మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె హరిచంద్ర ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళా కు ప్రముఖ …

Read More »

వంతెన మరమ్మత్తు పనులు….

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వంతెన మరమ్మత్తు పనుల్లో భాగంగా తొలిదశలో మిల్లింగ్ మెషిన్ తో పాత తారు రోడ్డు నీ తీసివేసే పనులు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. శనివారం సాయంత్రం గోదావరి వంతెన పనులను క్షేత్ర స్థాయి లో కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భగా కలెక్టర్ మాధవీలత పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పనులు అనుకున్న స్థాయిలో జరుగుతుండడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికే మొత్తం లేయర్ క్లీనింగ్, రిమూవింగ్ పనులు పూర్తి …

Read More »

శాస్త్ర సాంకేతిక రంగంలో దూసుకెళ్తున్న భారత్

-ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించిన పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ అభివృద్ధి సాధిస్తేనే ప్రపంచంలో గుర్తింపు లభిస్తుందని రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. అందుకే ఆ దిశగా విస్తృత కృషి సాగుతోందన్నారు. ఇస్రో ఆధ్వర్యాన నిర్వహిస్తున్న ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలలో భాగంగా శ్రీ వేంకటేశ్వర ఆనం కళాకేంద్రం ఆవరణలో ఏర్పాటుచేసిన ఇస్రో కార్యకలాపాల వివరాలు, రాకెట్స్ నమూనాల ప్రదర్శనను శనివారం ఆయన సందర్శించారు. ఈసందర్బంగా గోదావరి జిల్లాలకు చెందిన ఇస్రో శాస్త్రవేత్తలను …

Read More »

జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ని మరింత పటిష్టం చెయ్యాలి

-సుస్థిర ప్రతిపాదనలు రూపొందించి నిర్దుష్టమైన కార్యకలాపాలు నిర్వహించండి -జూనియర్, యూత్ సభ్యత్వం పై దృష్టి పెట్టాలి -మండలస్థాయి రెడ్ క్రాస్ సొసైటీ ఉప శాఖలను ఏర్పాటు చేయాలి -జిల్లా కలెక్టర్, ఐ ఆర్ సి ఎస్ అధ్యక్షులు కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ప్రజోపకరమైన కార్యక్రమాలను అమలు చేయడం కోసం నిర్దుష్టమైన కార్యాచరణ ప్రణాళిక తో ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ , ఐ ఆర్ సి ఎస్ అధ్యక్షురాలు డా కె. …

Read More »

రాకెట్ నమూనాల ప్రదర్శనకు పోటెత్తిన విద్యార్థులు.. 8తో ముగియనున్న ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు

-ప్రపంచంలోనే ఇస్రో నెంబర్ వన్ అవుతుంది .. విద్యా సంస్థల ప్రముఖులకు ఇస్రో బృందం సత్కారం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రపంచంలోనే నెంబర్ వన్ అవుతుందని ఇందుకు చంద్రయాన్ ప్రయోగం విజవంతమే నిదర్శనమని తిరుమల విద్యాసంస్థల అధినేత నున్న తిరుమలరావు అన్నారు. ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలలో భాగంగా శనివారం ఉదయం వివిధ విద్యాసంస్థల ప్రముఖులను  వేంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో శ్రీహరికోట షార్ ఎల్ఎస్ఎస్ఎఫ్ జనరల్ మేనేజర్, ఉత్సవాల ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ ఎన్. విజయకుమార్ …

Read More »

బంగారుకొండ కార్యక్రమం పై టీమ్ తూర్పు గోదావరి కి ప్రధాన కార్యదర్శి ప్రత్యేక ప్రశంస

-జిల్లా ప్రగతి పై కలెక్టర్ల తో ప్రధాన కార్యదర్శి సమీక్ష రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అమలు చేయడంలో లక్ష్యాలను సాధించడానికి అన్ని శాఖలతో సమన్వయం సాధించడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ కె. మాధవీలత తెలిపారు.శనివారం ఉదయం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే ఎస్ జవహర్ రెడ్డి న్యూఢిల్లీలోని ఏపి భవన్ నుండి ఈ క్రింది అజెండా అంశాలపై స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు, ఆరోగ్యం మరియు స్త్రీ & శిశు సంక్షేమం – ప్రభుత్వం, …

Read More »

జిల్లాలో 356 గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో జే ఏ ఎస్ సర్వే

-ఇప్పటి వరకు 3,35,614 గృహాల సందర్శన పూర్తి చేశారు -టోకెన్ రిజిస్ట్రేషన్ మాడ్యుల్ పై సాంకేతిక శిక్షణ కల్పించాలి -2వ దశ వాలంటీర్ లు ఇంటింటి సందర్శన పూర్తి చేయాలి -కలెక్టర్ కె.మాధవీ లత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం సాయంత్రం సిఎం కార్యాలయ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాల కొండయ్య జిల్లా కలెక్టర్ల తో జే ఏ ఎస్ పై సమీక్ష నిర్వహించారు. స్థానిక కలెక్టర్ విడిది కార్యాలయం నుంచి కలెక్టర్ మాధవీలత, డి ఎం హెచ్ వో …

Read More »

విద్యార్థినులతో ముఖాముఖి

-బాలల హక్కులపై అవగాహన కల్పించారు -అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాల ఆకస్మిక తనిఖీ -డి ఎల్ ఎస్ ఎ కార్యదర్శి కె. ప్రత్యూష కుమారి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ . కె. ప్రత్యూష కుమారి గోకవరం మండలం వీరలంకపల్లి గ్రామంలోని డా. బి.ఆర్. అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించారు. బాలికలను వారికి అందుతున్న సదుపాయాలు, వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. వారికి పాఠశాలలో …

Read More »