-లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం చట్టరీత్యా నేరం – కే వి కృష్ణా రావు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : 35 వ రహదారి భద్రత మాసోత్సవాలను పురస్కరించు కొని గురువారం డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్ రాజానగరం నందు లైసెన్సు పరీక్షల కొరకు వచ్చిన ధరఖాస్తు దారులకు మరియు వాహనముల ఫిట్నెస్ కొరకు వచ్చిన వాహన యజమానులకు మరింతగా రహదారి భద్రత పై అవగాహన కల్పించడం జరిగినదని జిల్లా రవాణా అధికారి కె వి కృష్ణా రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. …
Read More »Tag Archives: Rājamahēndravaraṁ
నగరపాలక సంస్థ పరిధిలో స్పందనలో వచ్చిన ప్రతి అర్జీ క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారుడు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ పరిధిలో స్పందనలో వచ్చిన ప్రతి అర్జీ క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారుడు సృతృప్తి చెందే విధంగా సత్వర పరిష్కరించడం జరుగుతుందని నగరపాలక సంస్థ కమిషనర్ కె. దినేష్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం నగర పాలక సంస్థ కార్యాలయంలో ప్రజల నుంచి 16 అర్జీలను స్వీకరించామన్నారు. ఈ సందర్భంగా దినేష్ కుమార్ మాట్లాడుతూ, ప్రజల నుంచి వచ్చే అర్జీల విషయంలో సత్వర పరిష్కారం కోసం అధికారులు, సిబ్బంది జవాబుదారీ తనం తో కూడి సేవలు అందించాలని …
Read More »జిల్లా ఉపాధి కార్యాలయంలో జనవరి 25 వ తేదీన మినీ జాబ్ మేళా
– జిల్లా ఉపాధి అధికారి హరిశ్చంద్ర ప్రసాద్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో జనవరి 25 వ తేదీ గురువారం ఉదయం 09:30 గంటలకు ఎస్ బి ఐ లైఫ్ , టాటా ట్రెంట్ లిమిటెడ్, అపోలో ఫార్మసీ కొరకు ఫర్మసిస్ట్, ఫార్మసీ అసిస్టెంట్, ఫార్మసీ ట్రైనీ, సేల్స్ ఎక్జిక్యూటివ్, లైఫ్ మిత్రస్, డెవలప్మెంట్ మేనేజర్స్ కొరకు జిల్లా ఉపాధి కార్యాలయం, షెల్టన్ హోటల్ సమీపంలో, హెచ్ పీ పెట్రోల్ పంప్ వెనుక, రాజమహేంద్రవరం, …
Read More »చిరుధాన్యాలు ఆహార పదార్థాలు ఎంతో మేలు చేస్తాయి
-వ్యవసాయ శాఖ డైరీ ఆవిష్కరణ చేసిన కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : చిరు ధాన్యాలు ద్వారా ఎంతో పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలు తయారు చేసుకోవచ్చునని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీ లత పేర్కొన్నారు. సోమవారం ఉదయం కలెక్టరేట్ లో వ్యవసాయ శాఖ అసోసియేషన్ డైరీ ని, చిరు ధాన్యాలతో 100 పిండి వంటలు పుస్తకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా కె. మాధవీలత మాట్లాడుతూ, 2023 వ సంవత్సరాన్ని ఐక్య రాజ్య సమితి …
Read More »స్పందనలో వచ్చిన ప్రజా సమస్యలు నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించాలి.
-నేడు స్పందనలో వచ్చిన అర్జీలు.131 -ఏ ఒక్క అర్జీ రీ ఓపెన్ కాకుండా అధికారులు పరిష్కరించాలి. రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్పందనలో వచ్చిన అర్జీలను అధికారులు విచారించి నిర్ణీత కాలవ్యవధిలోనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డా. కె.మాధవీలత అధికారులకు సూచించారు. సోమవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశం మందిరంలో నిర్వహించిన జిల్లాస్థాయి స్పందన కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, డిఆర్ఓ నరసింహులు తో కలిసి కలెక్టర్ మాధవీలత వినతి …
Read More »జిల్లాలో తుది ఓటరు జాబితా మేరకు 16,05,762
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ 2024 కార్యక్రమం లో కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నియమ నిబంధనల ననుసరించి తూర్పు గోదావరి జిల్లాలో 16,05,762 మంది ఓటర్లను గుర్తించామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ లో ఎస్ ఎస్ ఆర్ 2024 తుది ఓటర్ల జాబితా ను విలేఖరుల సమావేశంలో ప్రకటించారు . కలెక్టర్ మాధవీలత వివరాలు తెలియ చేస్తూ… ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ 2024 …
Read More »ఫిబ్రవరి 19 వరకు రహదారి భద్రతా మాసోత్సవాలు
– ప్రజలు రహదారి భద్రత కోసం సామాజిక బాధ్యత వహించాలి – కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రహదారి భద్రతని పాటించడం మనందరి సామాజిక బాధ్యత అని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పిలుపు నిచ్చారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ కార్యాలయ స్పందన సమావేశ మందిరంలో 35 వ రహదారి భద్రతా మాసోత్సవాలకు సందర్భంగా పోస్టర్లను, కరపత్రాలను జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్, జిల్లా రవాణా అధికారి కె వి కృష్ణా రావు తదితరులతో …
Read More »జిల్లాలోని ఏడు అంగనవాడి ప్రాజెక్టుల్లో ఇప్పటి వరకు 164 వర్కుర్లు, 162 సహాయకులు విధుల్లో జాయిన్ అయ్యారు. కలెక్టరు డా. మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఏడు అంగనవాడి ప్రాజెక్టుల్లో 1556 అంగన్వాడి కేంద్రాలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. కే మాధవీలత సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో 1538 అంగన్వాడి వర్కర్లు గాను ఇప్పటివరకు 164 మంది విధుల్లో చేరారని, అదేవిధంగా 1493 అంగన్వాడి సహాయకులకు గాను 162 మంది విధుల్లో చేరారని పేర్కొన్నారు. అంగన్వాడి వర్కర్లలో మెటర్నరీ, ఇతరులు కారణాల చేత 9 మంది, అంగన్వాడి హెల్పర్లు సంబంధించి 16 సెలవులో ఉన్నారని తెలిపారు. అంగన్వాడీ ప్రాజెక్టులు …
Read More »ఉషారాణి మృతిపట్ల మంత్రి వేణు తీవ్ర సంతాపం
-ఆమె ఆత్మకు శాంతి కలగాలని సందేశంలో పేర్కొన్న మంత్రి వేణు గోపాల్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ సతీమణి ఉషారాణి మృతి పట్ల జిల్లా ఇంఛార్జి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ కష్టకాలంలో ఆయన మనో ధైర్యంతో ఉండాలని, ఉషారాణి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నా అని మంత్రి ఆ ప్రకటనలో తెలిపారు. దుర్గేష్ కుటుంబ సభ్యులకు తన తీవ్ర …
Read More »రాజమండ్రి రూరల్ నియోజక వర్గంలో తాత్కాలిక స్ట్రాంగ్ రూం కోసం పరిధిలో న్యాక్ అదనపు భవనం పరిశీలన
– కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమండ్రి నియోజక వర్గ పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రి పంపిణీ, ఈ వి ఎం లు, అనుబంధ యూనిట్స్ భద్రపరిచేందుకు ముందస్తు ఏర్పాట్లను పరిశీలించడం జరిగిందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ , రూరల్ తహశీల్దార్ పి. చిన్నారావు తో కలిసి కలెక్టరేట్ ఆవరణలో ఉన్న న్యాక్ అనుబంధ భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా …
Read More »
Prajavartha Online Telugu News