Breaking News

Tag Archives: Rājamahēndravaraṁ

గురువారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె యస్ జవహర్ రెడ్డి  భూముల రిజిస్ట్రేషన్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె యస్ జవహర్ రెడ్డి  భూముల రిజిస్ట్రేషన్, రీ సర్వే, ఇనాం అసైన్ ల్యాండ్, స్త్రీ శిశు సంక్షేమ , వైద్య ఆరోగ్య, పంచాయతి రాజ్ అంశాలపై కలెక్టర్ల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కే . మాధవీలత ఇతర అధికారులు  వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత జిల్లా ప్రగతిపై సమగ్ర నివేదికను వివరిస్తూ,  రిజిస్ట్రేషన్ కోసం జిల్లాలో 57918 …

Read More »

భారత దేశ గిరిజనుల చరిత్ర , సంస్కృతి లప్రపంచానికే ఆదర్శం….

-జాతీయ స్థాయి గిరిజన సాంస్కృతిక మహోత్సవాల గోడ ప్రతి, కర పత్రాలు ఆవిష్కరణ -జిల్లా కలెక్టర్ కె.మాధవిలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గిరిజనుల సాంస్కృతిక, సంప్రదాయాలు దేశానికి పట్టుకొమ్మలు లాంటివి అని వాటిని కాపాడుకోవాల్సిన , భావితరాలకు వారసత్వంగా అందించాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ మాధవిలత పేర్కొన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో ఫిబ్రవరి 5 తేదీ ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాజమండ్రి నన్నయ్య విశ్వవిద్యాలయం లో నిర్వహించ నున్న జాతీయ స్థాయి గిరిజన సాంస్కృతిక మహోత్సవాల కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు. …

Read More »

దీర్ఘకాలికంగా ఉన్న  డ్రైనేజీ  సమస్యకు శాశ్వత పరిష్కారం.

– 25 లక్షల రూపాయలతో  త్వరలో డ్రైనేజీ నిర్మాణం -మంత్రి వేణుగోపాలకృష్ణ. రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా ఆరోగ్య పరిరక్షణకు  మెరుగైన శానిటేషన్, పరిశుభ్రత ఎంతో అవసరమని ఆ దిశగా  ప్రతి ఒక్కరూ  పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తూ  కాలుష్యం లేని గ్రామాలుగా తీర్చిదిద్దేదుకు ప్రజలు సహకరించాలని జిల్లా ఇన్చార్జి మంత్రి  రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార పౌర సంబంధాలు సినిమా ఆటోగ్రాఫీ శాఖ మంత్రి  చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. గురువారం రాజమండ్రి రూరల్ మండలం హుకుంపేట  గ్రామపంచాయతీ  …

Read More »

రక్త దాన శిబిరానికి విశేష స్పందన

-రక్తదానం ఇచ్చిన వారికి ప్రశంసా పత్రాలు అందజేత – సి హెచ్. సంపత్ కుమార్, జిల్లా రవాణా అధికారి (ఇన్చార్జి) రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : 35 వ రహదారి భద్రత మాసోత్సవాలను పురస్కరించుకొని ది:30-01-2024 న డా జక్కంపూడి. రాజశ్రీ , జక్కంపూడి రామ్మోహనరావు ఫౌండేషన్ వారి ఆధ్వర్యములో రక్త దాన శిబిరము ను నిర్వహించడం జరిగినదని, 52 మంది వరకు రక్త దానం చేశారని జిల్లా రవాణా అధికారి (ఇన్చార్జి) సి హెచ్. సంపత్ కుమార్ ఒక ప్రకటన లో …

Read More »

న్యాయవాదులతో సమావేశం…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయస్థాన ఆవరణలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గంధం సునీత వివిధ భీమా సంస్థల ప్రతినిధులు మరియు ఆ సంస్థల న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. మార్చి 9వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్ నందు అధిక మొత్తంలో మోటారు వాహనాల యాక్సిడెంట్ కేసులను పరిష్కరించేందుకు, బాధితులకు తగు పరిహారం అందించేందుకు తీసుకోవలసిన చర్యల గురించి చర్చించారు. ఈ మేరకు పెండింగ్ లో …

Read More »

జనవరి 29 వ తేదీ సోమవారం యధాతధంగా జిల్లా కలెక్టరేట్లో, డివిజన్ , మండల స్థాయి స్పందన

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం నిర్వహించే  జిల్లా, డివిజన్, మండల  స్థాయి స్పందన కార్యక్రమం జనవరి 29 సోమవారం యధావిధిగా  నిర్వహిస్తున్నట్లు   జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.రాజమహేంద్రవరం లోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో, అదేవిధంగా డివిజన్ స్థాయి లో ఆర్డీవో, మునిసిపల్ స్థాయి లో కమిషనర్లు, మండల స్థాయి అధికారులు, గ్రామ స్థాయి, గ్రామ, వార్డు సచివాలయాల నుంచి ప్రజలు నుంచి సంబంధిత సిబ్బంది స్పందన అర్జీలు స్వీకరిస్తారని తెలిపారు.   ఉదయం …

Read More »

ఘనంగా ఓటరు దినోత్సవ, సామాజిక సమతా ర్యాలీ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ ఓటరు దినోత్సవ స్ఫూర్తి తో ప్రతి ఒక్క అర్హత కలిగిన వారు ఓటరు గా నమోదు కావడం తో పాటు వారు తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించు కోవాలని కలెక్టర్ , జిల్లా ఎన్నికల అధికారి కే. మాధవీ లత పిలుపు నిచ్చారు. గురువారం స్థానిక వై జంక్షన్ నుంచి ఆనం కళా కేంద్రం వరకు జాతీయ ఓటర్ దినోత్సవ ర్యాలీ, అంబేడ్కర్ స్ఫూర్తి తో సామాజిక సమతా సంకల్పం ర్యాలీ ని కలెక్టర్ ప్రారంభించారు. …

Read More »

15 వ జాతీయ ఓటరు దినోత్సవ శుభాకాంక్షలు

-ఎన్నికల సిబ్బంది, బి ఎల్ ఓ లకు ప్రోత్సాహక అవార్డు ప్రధానం -ఆకట్టుకున్న ఓటరు చైతన్య సాంస్కృతిక కార్యక్రమాలు, నాటిక -మన భవిష్యత్ ను, తలరాత మార్చే ఒకే ఒక్క ఆయుధం ఓటు -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఓటు హక్కు మనకు రాజ్యాంగం కల్పించిన వజ్రాయుధం, ప్రతి ఒక్కరూ అమూల్యమైన ఓటు హక్కు ను తప్పనసరిగా వేసి, తమను పరిపాలించే ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీ లత విజ్ఞప్తి చేశారు. …

Read More »

ఎన్నికల ముందస్తు ఏర్పాట్లు పై కలెక్టర్ల తో వీడియో కాన్ఫరెన్స్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె యస్ జవహర్ రెడ్డి రీ సర్వే, ఉపాధి హామీ, జలజీవన్ మిషన్, పిఎంజి , వైద్య ఆరోగ్య, ఎన్నికల ముందస్తు ఏర్పాట్లు పై కలెక్టర్ల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ మాధవీలత, జేసీ తేజ్ భరత్, ఇతర అధికారులు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత జిల్లా ప్రగతిపై సమగ్ర నివేదికను వివరిస్తూ,  జిల్లాలో 3 దశ రీ సర్వే …

Read More »

కృషి విజ్ఞాన కేంద్రం, కలవచర్ల షెడ్యూల్డ్ కులాల ఉపప్రణాళిక కిసాన్ మేళా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం స్థానిక కలవచర్ల కృషి విజ్ఞాన కేంద్రంలో షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళికలో భాగంగా ‘కిసాన్ మేళా’ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర పొగాక పరిశోధనా సంస్థ (ICAR- CTRI), రాజమండ్రి డైరెక్టర్ డా. మాగంటి శేషమాధవ్ ముఖ్యఅతిథిగా హాజరైనారు. ఈ కార్యక్రమానికి రాజానగరం, కలవచర్ల, నరేంద్రపురం, పిఠాపురం, గోకవరం, గుమ్మల దొడ్డ, గాదరాడ తదితర గ్రామాల నుండి సుమారు 270 మంది షెడ్యూల్ కులాల రైతులు, రైతు మహిళలు, వ్యవసాయ శాఖ, ఉద్యాన …

Read More »