గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా ఇన్ చార్జ్ మంత్రి మరియు రాష్ట్ర పర్యాటక , సాంస్కృతిక , సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అధ్యక్షతన ఈ నెల 28 వ తేది ( మంగళవారం ) ఉదయం 10.30 గంటలకు కలక్టరేట్ లోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో జిల్లా సమీక్షా కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా ముఖ్య ప్రణాళికా అధికారి నేడొక ప్రకటనలో పేర్కొన్నారు. సమావేశంలో అజెండా అంశాలైన వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు , పరిశ్రమలు మరియు స్కిల్ , గుంటూరు నగరపాలక సంస్థ , యంటీయంసీ , హౌసింగ్ , డిస్ట్రిక్ట్ వాటర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ , మెడికల్ అండ్ హెల్త్ , విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ శాఖలపై సమీక్షించడం జరుగుతుంది. గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి, ప్రజాప్రతినిధులు , అధికారులు సమావేశానికి హాజరు కానున్నారు.
Tags guntur
Check Also
పీఎం సూర్యఘర్ మండల లక్ష్యాలపై దృష్టిపెట్టండి
– సౌర ఫలకాల ఏర్పాటును వేగవంతం చేయండి – ఎప్పటికప్పుడు అమలు పురోగతిపై ప్రత్యేకంగా సమీక్ష – ఎన్టీఆర్ జిల్లా …