-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చిట్టినగర్ సొరంగం మార్గంలో కొండలు విరిగిపడ్డాయి అన్న వార్తలు వాస్తవం కాదని ఖండించారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. సొరంగంలో విజయవాడ నగరపాలక సంస్థ వారు చేపట్టిన పలు మరమ్మతుల కారణంగానే ట్రాఫిక్ మళ్లింపులు చేశారని తెలిపారు. నగర ప్రజలు ఇటువంటి వార్తలతో ఎటువంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, విజయవాడ నగరపాలక సంస్థ ఎల్లప్పుడూ ప్రజల శ్రేయస్సు, సంక్షేమం, నగరాభివృద్ది దిశగా చర్యలు తీసుకుంటుందని శనివారం నాడు కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.
Prajavartha Online Telugu News