Breaking News

Konduri Srinivasa Rao

నాగరికత, సంస్కృతులకు మూలం జానపద విజ్ఞానమే… : ఉపరాష్ట్రపతి

-భాష, కళలు, ఆచార వ్యవహారాలు, పంటలు, విశ్వాసాల సమాహారమే జానపద విజ్ఞానం -జానపద సంపద లేకుండా అభివృద్ధి చెందిన భాష, సంస్కృతులు లేవన్న ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు -జానపదాన్ని గ్రామీణ భారతాన్ని వేర్వేరుగా చూడలేము -సామాజిక రుగ్మతల నిర్మూలనలో, స్వాతంత్ర్య పోరాటంలో జానదాలు పోషించిన పాత్ర మరువలేనిది -కోవిడ్ పట్ల ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే దిశగా జానపద కళాకారుల చొరవ అభినందనీయం -జానపద విజ్ఞానాన్ని ముందు తరాలకు అందించేందుకు సృజనాత్మక మార్గాలను అన్వేషించాలి -సినిమా, టీవీ, రేడియో జానపదానికి ప్రాధాన్యత పెంచాలి -జానపద కళాకారులు …

Read More »

శ్రీ లక్ష్మీ నారసింహ స్వామివారి ఆలయం వద్దనున్న గాలి గోపురాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే ఆర్కే…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మంగళగిరి నగరంలోని శ్రీ లక్ష్మీ నారసింహ స్వామివారి ఆలయం వద్ద నిన్న రాత్రి గాలి గోపురం దక్షిణం వైపు కూలిన గోడను  ఎమ్మెల్యే ఆర్కే పరిశీలించారు. తొలుత ఆలయం వెలుపల మరియు ఆలయ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి ఆలయ అధికారులకు తగు సూచనలు చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు , ఆలయ ప్రహరీ గోడ వద్ద ఆనుకుని ఉన్న భారీ వృక్షాల మూలంగా ప్రహరీ గోడ కూలి ఉంటది అన్న అనుమానం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీ …

Read More »

శాప్ నెట్ ను బలో పేతం చేసి ప్రజలకు మరిన్ని సేవలు అందించేందుకు కృషి చేస్తాం…

-విద్య గ్రామీణాభివృద్ధి ఐటి వ్యవసాయ గ్రామ సచివాలయాల రంగాల్లో శాప్ నెట్ ద్వారా సేవలు అందిస్తాం… -శాప్ నెట్ ద్వారా విద్యార్థులకు దూరవిద్యా సేవలు అందిస్తున్నాం… -రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజాజీవన విధానంలో మెరుగైన సేవలు అందించే విధంగా శాటి లైట్ రంగంలో పొసైటీ ఫర్ ఆంధ్రప్రదేశ్ నెట్ వర్క్ (శాప్ నెట్) ను బలోపేతం చేయుట ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయనున్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల …

Read More »

గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన ఆర్ పి సిసోడియా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఎఎస్ అధికారి ఆర్ పి సిసోడియా సోమవారం బాధ్యతలు తీసుకున్నారు. తొలుత గవర్నర్ తో సమావేశం అయిన అనంతరం రాజ్ భవన్ లోని తన ఛాంబర్ లో సిటిసిపై సంతకం చేసారు. రాజ్ భవన్ లోని అన్ని విభాగాలను స్వయంగా పరిశీలించి ఏ అధికారి స్దానం ఎక్కడ , వారి విధులు ఏమిటి అన్న దానిపై సమాచారం తీసుకున్నారు. అనంతరం రాజ్ భవన్ అధికారులతో …

Read More »

వాణిజ్యం పరిశ్రమల శాఖ (ఆహార శుద్ది) కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన ముఖేష్ కుమార్ మీనా

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజ్ భవన్ పూర్వ కార్యదర్శి, సీనియర్ ఐఎఎస్ అధికారి ముఖేష్ కుమార్ మీనా వాణిజ్యం పరిశ్రమల శాఖ (ఆహార శుద్ది) కార్యదర్శిగా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. వెలగపూడి సచివాలయంలోని ఐదవ బ్లాక్ మొదటి అంతస్తులో నూతనంగా కేటాయించిన ఛాంబర్ లో పూజాదికాలు నిర్వహించి బాధ్యతలు తీసుకున్నారు. తొలుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ తో సహా పలువురు సీనియర్ అధికారులతో మీనా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ ఆహార శుద్ది …

Read More »

రాష్ట్రంలో పేదలకు ఇళ్ల నిర్మాణంపై సీఎం వైయస్‌.జగన్‌  సమీక్ష…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పేదలకు ఇళ్ల నిర్మాణంపై రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి క్యాంప్‌ కార్యాలయంలో సోమవారం సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ… పేదలందరికీ ఇళ్ల నిర్మాణం కార్యక్రమంలో ప్రగతిని అధికారులు వివరించారు. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణపనులు, ఇతరత్రా అంశాలపై సీఎం ఆదేశించిన విధంగా స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించామని, వారినుంచి ఫీడ్‌ బ్యాక్‌ను తీసుకున్నా మని అధికారులు తెలిపారు. నిర్మించనున్న ఇళ్ల మ్యాపింగ్, రిజిస్ట్రేషన్, జాబ్‌కార్డుల జారీ, జియో …

Read More »

సీఎం వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పాలనను చూసి టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారు… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సీఎం వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి  సంక్షేమ పాలనను చూసి టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో భాగంగా 31వ డివిజన్ లోని ముత్యాలంపాడు అంబేద్కర్ కాలనీలో స్థానిక కార్పొరేటర్ పెనుమత్స శిరీష సత్యం తో కలిసి ఆయన పర్యటించారు. గడప గడపకూ తిరిగి వినతులను స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యే  మాట్లాడుతూ.. గుడ్ మార్నింగ్ విజయవాడ కార్యక్రమంతో అధికారులు, ప్రభుత్వ సిబ్బందిలో జవాబుదారీతనం పెరిగిందన్నారు. ప్రజాసమస్యల …

Read More »

కరోనా నియంత్రణ చర్యల్లో ఏపీ దేశానికే ఆదర్శం… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు 

-మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ను పరిశీలించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కరోనా నియంత్రణ చర్యల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు  అన్నారు. మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా 61వ డివిజన్ లోని 258 వార్డు సచివాలయంలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ సెంటర్ ను డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి రమాదేవితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ థర్డ్ వేవ్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల …

Read More »

ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు అశ్రద్ధ చూపవద్దు… : కలెక్టర్ జె.నివాస్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రజాసమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమానికి గైర్హాజరైన అధికారులపై జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పందన కార్యక్రమానికి హాజరుకాని అధికారులందరికీ వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేయమని అధికారులను ఆయన ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ప్రజాస్పందన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ జె.నివాస్ అధికారులతో నిర్వహించారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు అశ్రద్ధ చూపవద్దని ఆయన ఈ సందర్భంగా సూచించారు. జిల్లాలోని అసంఘటిత కార్మికుల వివరాలను సేకరించాలని జిల్లా అధికారులకు ఆదేశించారు. …

Read More »

స్పందనకు 10 అర్జీలు…

-న‌గ‌ర మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజ‌యవాడ న‌గ‌ర పాల‌క సంస్థ ప్ర‌ధాన కార్యాల‌యంలో సోమవారం స్పందన గ్రీవెన్స్ కార్యక్రమము ద్వారా మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వారి సమస్యలను సావధానంగా విన్న మేయ‌ర్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. స్పందన కార్యక్రమములో పట్టణ ప్రణాళిక -7, డిప్యూటీ కమీషనర్ (రెవిన్యూ) -1, పబ్లిక్ హెల్త్ – 1, యు.సి.డి విభాగం – 1 మొత్తం 10 అర్జీలు స్వీక‌రించిన్న‌ట్లు వివ‌రించారు. …

Read More »