-ఎపి నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకారమహోత్సవానికి హాజరు -చైర్మన్ రుద్ర కోటి , డైరెక్టర్లకు శుభాకాంక్షలు తెలిపిన ఎంపి కేశినేని శివనాథ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నాయీ బ్రాహ్మణుల సంక్షేమమే టీడీపీ ధ్యేయమని ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. ఎపి నాయీ బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఆ సంస్థ డైరెక్టర్ల ప్రమాణ స్వీకారమహోత్సవానికి ఎంపి కేశినేని శివనాథ్ ముఖ్యఅతిథిగా హాజరైయ్యారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్ గా …
Read More »Monthly Archives: January 2025
ప్రజలకు ప్రభుత్వ పథకాలపై మరింతగా అవగాహన కల్పించాలి : ఎంపి కేశినేని శివనాథ్
-జిల్లా ఐ.టి.డి.పి కార్యవర్గ సభ్యులతో సమావేశం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభుత్వ ఆరాచక పాలనపై ప్రజా సమస్యలు వెలుగులోకి తెచ్చి, ప్రజా గళం వినిపించటంలో ఐటిడిపి కీలకపాత్ర పోషించింది. అంతకు మించిన బాధ్యతతో ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై సోషల్ మీడియా ద్వారా మరింతగా అవగాహన కల్పించాలని ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఐ.టి.డి.పి కార్యవర్గ సభ్యులతో గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో మంగళవారం ఎంపి కేశినేని శివనాథ్ సమావేశం నిర్వహించారు. …
Read More »ఎంపి కేశినేని శివనాథ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన అనంతపురం ఎంపి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అనంతపురం ఎంపి అంబికా జి. లక్ష్మీనారాయణగురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో మంగళవారం విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంపి కేశినేని శివనాథ్ కు ఎంపి లక్ష్మీనారాయణ పుష్పగుచ్ఛం అందించారు. అనంతరం పార్లమెంట్ లో జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలతో పాటు రాష్ట్ర రాజకీయాలపై మాట్లాడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా టిడిపి ఉపాధ్యక్షుడు గుర్రం కొండయ్య, విజయవాడ వాల్మీకి బోయ సంఘం అధ్యక్షుడు వరిగే నరసింహారావులతో …
Read More »ఎన్టీఆర్ జిల్లాలో 2లక్షల ఇళ్లకు సూర్యఘర్ కనెక్షన్స్ అందించటమే ధ్యేయం : ఎంపి కేశినేని శివనాథ్
-సూర్యఘర్ పథకం పై పటమట సెంటర్ లో అవగాహన ర్యాలీ -ర్యాలీ లో పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాథ్, కలెక్టర్ లక్ష్మీ శ, మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర, -ఎన్టీఆర్ జిల్లాలోని ప్రతి ఇంట్లో సౌర వెలుగులు నిండాలి -పర్యావరణ పరిరక్షణకు మేలు చేసే పథకం పీఎం సూర్య ఘర్ -విద్యుత్ చార్జీలు చెల్లింపుల భారం తగ్గించాలన్నదే లక్ష్యం.. -పీఎం సూర్యఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు విద్యుత్ బిల్లుల చెల్లింపుల భారం తగ్గించేందుకు అమలు చేస్తున్న …
Read More »నిధులు వినియోగంలో నిర్లక్ష్యం చూపొద్దు
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాబోయే రెండు నెలల్లో బీసీ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధులు వినియోగంలో నిర్లక్ష్యం చూపొద్దని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆదేశించారు. మంగళవారం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్.సత్యనారాయణ, డైరెక్టర్ మల్లికార్జున, ఇతర అధికారులతో మంత్రి సవిత సమీక్షా సమావేశం నిర్వహించారు. హాస్టళ్ల మరమ్మతులు, విద్యార్థులకు అవసరమైన ట్రంకు పెట్టెలు, దుప్పట్లు, ఇతర అవసరాలకు …
Read More »టెన్త్ లో వంద శాతం ఫలితాలు సాధించాలి
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కార్పొరేట్ కు ధీటుగా రాబోయే పదో తరగతి పరీక్షల్లో వంద శాతం ఫలితాలు సాధించాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టంచేశారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రి సవితను ఎంజేపీ గురుకుల పాఠశాల ఉద్యోగుల అసోసియేషన్ ప్రతినిధులు కలిశారు. పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చి, వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరుతూ వినతి పత్రమందజేశారు. ఈ సందర్భంగా మంత్రి …
Read More »ఉషా ఉతుప్, మృణాల్ ఠాకూర్లతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన తనైరా యొక్క మొదటి బ్రాండ్ చిత్రం
-ఉషా ఉతుప్ మరియు మృణాల్ ఠాకూర్లతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన తనైరా యొక్క మొదటి బ్రాండ్ చిత్రం , ఇది పనితనం మరియు వారసత్వం ను వేడుక జరుపుకుంటుంది -ప్రతి డ్రెప్లో నమ్మకం, పారదర్శకత మరియు శాశ్వత గాంభీర్యంతో సమాచారంతో కూడిన ఎంపికలు చేయడానికి వినియోగదారులకు అధికారం ఇస్తుంది విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : టాటా గ్రూప్ కు చెందిన తనైరా తమ మొట్టమొదటి బ్రాండ్ ప్రచారాన్ని ఆవిష్కరించింది, విశ్వాసం, ప్రామాణికత, స్వచ్ఛత, హస్తకళా నైపుణ్యం, వైవిధ్యభరితమైన భారతీయ చేనేత వంటి వాటి …
Read More »ఘనంగా పి.బి. సిద్ధార్థ ఎన్.సి.సి. విజయంత పోటీలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయంత 2.0 (భారత సైన్యంలో మొదటి స్వదేశీయుద్ధట్యాంకు) పేరుతో విజయవాడలోని పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల బాలికల ఎన్.సి.సి. బెటాలియన్ (4ఎ) ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు క్రీడలు, ఇతర పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. నగరంలోని 14 స్కూళ్లు, ఆరు కాలేజీల నుంచి 537 మంది విద్యార్థులు పాల్గొన్నారు. రన్నింగ్, త్రోబాల్, పోకో, టగ్ ఆఫ్ వార్ తదితర క్రీడాంశాల్లో జరిగిన పోటీల్లో ఓవరాల్ మొదటి బహుమతి నలంద కళాశాల, …
Read More »విదేశీ వైద్య గ్రాడ్యుయేట్లు (FMGలు) పై జరిగిన నిరసన దృష్ట్యా…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్ -19 మహమ్మారి మరియు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా తమ M.B.B.S కోర్సులో కొంత బాగాన్ని ఆన్ లైన్ లో పూర్తి చేసిన విదేశీ వైద్య విద్యార్థులు ఆంధ్రప్రదేశ్లో ఒక సంవత్సరం ఇంటర్న్షిప్ పూర్తి చేసిన తర్వాత శాశ్వత రిజిస్ట్రేషన్ (P. R) మంజూరు చేయాలని ఏ.పి మెడికల్ కౌన్సిల్ (APMC)ని అభ్యర్థించారు. చాలా మంది విదేశీ వైద్య విద్యార్థులు భారతదేశానికి తిరిగి వచ్చి ఆన్లైన్లో తమ వైద్య విధ్యను కొనసాగించిన తరువాత ఆఫ్లైన్ మోడ్లో కోర్సు …
Read More »జాబ్ మేళాలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్దిసంస్దఆధ్వర్యంలోఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారి ఆదేశముల మేరకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను రూపుమాపడానికి కృషి చేస్తున్నది. దీనిలో భాగముగానిరుద్యోగ యువతకు వారికి ఉద్యోగ మేళాలు నిర్వహించి ఉద్యోగాలు ఇప్పించడం జరుగుతుంది. గుంటూరు జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి కొండాసంజీవరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్దిసంస్ద, జిల్లా ఉపాది కార్యాలయం మరియు సీడాప్ (SEEDAP) వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 30-01-2025 వ తేదీన మంగళగిరి మరియు ఫిరంగిపురం నందు జాబ్ మేళాలు నిర్వహిస్తున్నట్లు …
Read More »
Prajavartha Online Telugu News