Breaking News

Monthly Archives: January 2025

జనవరి 30 కల్లా ఇళ్ళ రిజిస్ట్రేషన్ చేయించుకోండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ వారు జారీ చేసిన పట్టాలను గజం కేవలం 100 రూపాయలకే రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు జనవరి 30 ఆఖరితేదని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం నాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో అన్నారు. పాయకాపురం, కొత్త రాజరాజేశ్వరి పేట ప్రాంతాలలో విజయవాడ నగరపాలక సంస్థ వారు కేటాయించిన పట్టాలను గజం 100 రూపాయలకే రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రధాన కార్యాలయంలో గల నూతన భవనంలోని …

Read More »

కొండ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల క్షేమం ఎంతో ముఖ్యం

-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : కొంత ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల క్షేమం ఎంతో ముఖ్యమైనదని అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా మొగల్రాజపురం, క్రీస్తు రాజపురం, చిట్టినగర్, ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నగర పరిధిలో ఉన్న కొండ ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించి, ప్రజలకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు నివసిస్తున్న కొండ ప్రాంతాల్లో గల …

Read More »

అన్న క్యాంటీన్లలో ఆహార నాణ్యతను క్రమ తప్పకుండా అధికారులు పరిశీలించాలి

-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పరిధిలో గల ఉన్న అన్ని అన్నా క్యాంటీన్లో ఆహార నాణ్యతను నోడల్ ఆఫీసర్లు ఎప్పటికప్పుడు క్రమ తప్పకుండా పరిశీలించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర అన్నారు. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్, హెచ్ బి కాలనీ ప్రాంతాలని పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్, హెచ్ బి కాలనీ లోగల అన్న …

Read More »

జయహో భారత్… GSLV-F15 రాకెట్‌ గగనతల ప్రయోగం విజయవంతం… అంబరాన్నంటిన శాస్త్రవేత్తల సంబరాలు

-సైన్స్ ఫెయిర్ నందు ప్రతిభ చూపిన సూళ్లూరుపేట ఉన్నత పాఠశాల విద్యార్థినీ విద్యార్థులతో కలిసి షార్ కేంద్రంలో వందో ప్రయోగమైన జీఎస్ఎల్వీ-ఎఫ్15 రాకెట్ ప్రయోగాన్ని వీక్షించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ శ్రీహరి కోట, తిరుపతి జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త : ఇస్రో భారత అంతరిక్షంలో మరో మైలురాయిని చేరుకుంది. శ్రీహరికోటలోని షార్ నుంచి తన వందో ప్రయోగమైన జీఎస్ఎల్వీ-ఎఫ్15 రాకెట్ ను నేటి బుధవారం ఉదయం 6.23 గం.లకు రోదసిలోకి సక్సెస్ ఫుల్ గా దేశీయంగా రూపొందించిన ఈ క్రయోజనిక్ …

Read More »

చేనేత కార్మికుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది…

బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త : చేనేత కార్మికుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని బాపట్ల జిల్లా ఇన్చార్జి మంత్రి సమాచార పౌర సంబంధాల శాఖ మరియు గృహ నిర్మాణాల శాఖల మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. చీరాల నియోజకవర్గంలోని దేవాంగపురి గ్రామపంచాయతీలో గ్రామీణ అభివృద్ధి సంస్థ మరియు పంచాయితీ రాజ్ సంయుక్తంగా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ స్కీం క్రింద రూ.47.50 లక్షలతో నిర్మించిన 8 సిమెంట్ రోడ్లను జిల్లా ఇన్చార్జి మంత్రి మంగళవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. …

Read More »

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి ప్రాధాన్యం ఇచ్చేలా చూడండి

-కొత్త రహదారుల కేటాయింపు, రహదారుల విస్తరణకు అనుమతులు వచ్చేలా చేయాలి -రాష్ట్ర పరిస్థితిని వివరించి రాష్ట్రాభివృద్ధికి నిధులు, ప్రాజెక్టులు తీసుకురావాలి -టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి ప్రాధాన్యం ఇచ్చేలా, రాష్ట్రంలోని ప్రాజెక్టులకు అవసరమైనన్ని నిధులు కేటాయించేలా చూడాలని టీడీపీ ఎంపీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మంగళవారం ఉండవల్లి నివాసంలో చంద్రబాబు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని …

Read More »

ఈనెల 31వ తేదిన జరిగే శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి

-పెనుగొండ ఆలయంలో అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం -ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మెన్ డూండి రాకేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మాఘ శుద్ధ విదియ అనగా ఈనెల 31 వ తేదిన పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలోని పెనుగొండనందలి శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి దేవాలయంలో చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. స్థానిక నాయకులు కూడా పాల్గొని అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ డూండి రాకేష్ పిలుపునిచ్చారు. కుల, మత, ప్రాంతీయాలకు అతీతంగా ఈ వేడుకలు జరపాలన్నారు. …

Read More »

తిరుపతి స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలి

-జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ .ఎస్  తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త స్మార్ట్ సిటీ నిధులతో తిరుపతి నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు మరింత వేగంగా నిర్దేశించిన గడువులోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ .ఎస్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ లోని మిని సమావేశ మందిరం నందు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య, స్మార్ట్ సిటీ పై ఎన్ ఇ సి కంపెనీ ప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ …

Read More »

ప్రధాన మంత్రి సూర్య ఘర్ – ముప్తి బిజ్లి యోజన పథకం

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త దేశ వ్యాప్తంగా కోటి ఇళ్లకు ఉచిత కరెంటు అందించే ఉద్దేశంతో భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన స్కీమ్ ప్రధాన మంత్రి సూర్య ఘర్ – ముప్తి బిజ్లి యోజన పథకం ప్రతి ఇంటికి తీసుకు వెళ్ళాల ప్రజలకి తెలియచేయడానికి సచివాలయం సిబ్బందితో కలిసి కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ ప్లే కార్డ్స్ పట్టుకొని ప్రతి వీధిలో ర్యాలీ నిర్వహించటం జరిగింది ఈ సందర్భంగా కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ మాట్లాడుతూ …

Read More »