Breaking News

Monthly Archives: January 2025

మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సమావేశం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA) సమావేశం ముడా చైర్మన్ మట్టా ప్రసాద్ అధ్యక్షతన, కో- చైర్మన్ జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ లతో కలెక్టరేట్లో శుక్రవారం జరిగింది. ముడా పరిధిలో లేఅవుట్లకు ముడా నుండి నిబంధనల మేరకు తగిన అనుమతులు తప్పనిసరిగా పొందాలని, ముడా పరిధిలోని గ్రామాల్లో భవన నిర్మాణాలకు ఆన్లైన్ ద్వారా ముడా అనుమతులు పొందాలని, ముడా పరిపాలన భవనాన్ని నిర్మించేందుకు అవసరమైన స్థలం కేటాయించాలని సమావేశంలో తీర్మానించారు. …

Read More »

కోడూరు మండలంలో పర్యటించిన జిల్లా కలెక్టర్

కోడూరు, నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కోడూరు మండలంలో పర్యటించి మండలంలోని ఉల్లిపాలెంలో అంగన్వాడీ కేంద్రం, మండలపరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, కోడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొదటగా జిల్లా కలెక్టర్ ఉల్లిపాలెంలో అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి పిల్లల హాజరు, బరువును నమోదు చేసే రిజిస్టర్లు, అదేవిధంగా పిల్లలకు పెడుతున్న మెనూపై ఆరా తీసి నాణ్యతను పరిశీలించారు. ఈ క్రమంలో ఆయన బరువు తూచే యంత్రంపై పిల్లలను స్వయంగా ఉంచి బరువును రిజిస్టరులో నమోదు …

Read More »

శానిటేషన్ పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో శానిటేషన్ పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని జిల్లా కలెక్టర్ డి కే బాలాజీ అధికారులను, శానిటేషన్ సిబ్బందిని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ శుక్రవారం ఉదయం స్థానిక 45, 46 డివిజన్లలో పర్యటించి ఇంటింటి చెత్త సేకరణ ఎలా జరుగుతున్నది? పరిశీలించారు. చెత్త సేకరించే సమయంలో తడి /పొడి చెత్త వేరు చేయించి సేకరించాలని సిబ్బందికి సూచించారు. ఇంటింటి చెత్త సేకరణ జరుగుతున్నప్పటికీ రోడ్ల వెంబడి చెత్త ఎవరు వేస్తున్నారు, ఎందుకు వేస్తున్నారని, శానిటేషన్ సిబ్బంది …

Read More »

100 శాతం జ‌న‌న‌, మ‌రణాల న‌మోదు జ‌ర‌గాల్సిందే..

– అత్యంత స‌ర‌ళీకృతంగా ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల జారీకి కృషిచేయాలి – ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల కోసం ఏ ఒక్క‌రూ ఇబ్బంది ప‌డ‌కూడ‌దు – కార్యాల‌యాల చుట్టూ తిరిగే ప‌రిస్థితి ఎట్టిప‌రిస్థితుల్లోనూ ఉండ‌కూడ‌దు – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో 100 శాతం జ‌న‌న‌, మ‌ర‌ణాల న‌మోదుకు అధికారులు, సిబ్బంది కృషిచేయాల‌ని, అత్యంత స‌ర‌ళీకృతంగా ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల జారీకి కృషిచేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ ఆదేశించారు. జిల్లా విభజన అనంత‌రం మొదటిసారిగా జనన మరణ సంఘటనల రిజిష్ట్రీకరణపై …

Read More »

ఏ ఒక్క క్లెయిమ్ పెండింగ్ ఉండ‌కూడ‌దు

– ఈ నెలాఖ‌రులోగా శ‌త‌శాతం ప‌రిష్కారానికి కృషిచేయాలి – ఇప్ప‌టికే పూర్త‌యిన 98.82 శాతం క్లెయిమ్‌ల సెటిల్‌మెంట్‌ – బాధితుల‌కు చేయూత‌నివ్వ‌డంలో బీమా సంస్థ‌ల కృషి భేష్‌ – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంత ప్ర‌జ‌ల వాహ‌నాలు, వివిధ ఆస్తి న‌ష్టాల‌కు సంబంధించి బీమా క్లెయిమ్‌ల ప‌రిష్కారంలో బీమా సంస్థ‌లు చూపిన చొర‌వ ప్ర‌శంస‌నీయ‌మ‌ని.. ఇప్ప‌టికే 98.82 శాతం క్లెయిమ్‌ల ప‌రిష్కారం పూర్త‌యింద‌ని, మిగిలిన కొద్దిపాటి క్లెయిమ్‌ల‌ను కూడా ఈ నెలాఖ‌రులోగా త్వ‌రిత‌గ‌తిన …

Read More »

49,218 మందికి రూ. 326 కోట్ల సబ్సిడీతో రుణాలు అందిస్తాం

-ముఖ్యమంత్రి చంద్రబాబు ముస్లిం, మైనార్టీల పక్షపాతి -మౌలానా షేక్ ముస్తాక్ అహ్మద్, చైర్మన్,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అల్ప సంఖ్యాక వర్గాల ఆర్థిక సంస్థ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని ముస్లిం, మైనార్టీల అభివృద్ది, సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలు అందించిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అల్ప సంఖ్యాక వర్గాల ఆర్థిక సంస్థ చైర్మన్ మౌలానా షేక్ ముస్తాక్ అహ్మద్ తెలిపారు.. బందరు రోడ్డులోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అల్ప సంఖ్యాక వర్గాల ఆర్థిక సంస్థ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు …

Read More »

ఎంపి కేశినేని శివ‌నాథ్ కు కృత‌జ్ఞ‌తలు తెలిపిన మామిడి రైతులు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం రెడ్డి గూడెం మండ‌లం రెడ్డిగుంట మామిడి రైతులు ఎంపి కేశినేని శివ‌నాథ్ ను క‌లిసి ప్రూట్ క‌వ‌ర్స్ 50 శాతం స‌బ్సీడితో ల‌భించేలా కృషి చేసినందుకు కృత‌జ్ఞ‌తలు తెలిపారు. గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్ లో శుక్ర‌వారం రెడ్డి గూడెం రైతు ఉత్పత్తి దారుల సంఘం (ఎఫ్.పి.సి) డైరెక్ట‌ర్లు చేబ్రోలు శ్రీనివాస‌రావు, చేబ్రోలు రాజు ఆధ్వ‌ర్యంలో మామిడి రైతులు ఎంపి కేశినేని శివ‌నాథ్ ను క‌లిశారు. ఎమ్.ఐ.డి.హెచ్ స్కీమ్ కింద …

Read More »

ఎంపి కేశినేని శివనాథ్ ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసిన ఎయిమ్స్ డైరెక్టర్‌ డాక్టర్‌ మాధబానంద కర్‌

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : మంగళగిరి ఎయిమ్స్ పాలకమండలి సభ్యుడు, విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ ను మంగ‌ళ‌గిరి ఎయిమ్స్ డైరెక్ట‌ర్ ప్రొఫెస‌ర్. డాక్ట‌ర్ మాధ‌బానంద్ క‌ర్ ( Prof. Dr. Madhabananda Kar) మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు.. గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్ లో ఎంపి కేశినేని శివ‌నాథ్ కు పుష్ప‌గుచ్ఛం అందించి శాలువాతో స‌త్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ఇరువురు మంగ‌ళ‌గిరి ఎయిమ్స్ అభివృద్ది ప‌నుల‌పై కాసేపు చ‌ర్చించుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మంగ‌ళ‌గిరి ఎయిమ్స్ డిప్యూటీ డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్) …

Read More »

అత్యంత పార‌ద‌ర్శ‌కంగా గీత కార్మికుల‌కు మ‌ద్యం దుకాణాల కేటాయింపు ప్ర‌క్రియ‌

– 11 దుకాణాల‌కు ఈ నెల 27న గెజిట్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌ – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం అత్యంత పార‌ద‌ర్శ‌కంగా గీత కార్మికుల‌కు మ‌ద్యం దుకాణాల కేటాయింపు ప్ర‌క్రియ చేప‌ట్ట‌డం జ‌రుగుతుంద‌ని, ఇందులో భాగంగా ఈ నెల 27న గెజిట్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌నున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. జిల్లాలో 11 మ‌ద్యం దుకాణాల‌ను గీత కార్మికుల ఉప కులాల‌కు కేటాయించేందుకు శుక్ర‌వారం క‌లెక్ట‌రేట్‌లో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ …

Read More »

బాలికా సాధికార‌తకు చేయీచేయీ క‌ల‌పాలి

– అన్ని రంగాల్లోనూ మ‌హిళ‌లు ఉన్న‌తంగా ఎదిగేలా తోడ్పాటునందించాలి – లింగ వివ‌క్ష ర‌హిత స‌మాజ స్థాప‌నలో ప్ర‌తిఒక్క‌రూ భాగ‌స్వాములు కావాలి – జాతీయ బాలికా దినోత్స‌వ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : బాలికా సాధికార‌త‌కు ప్ర‌తిఒక్క‌రూ చేయీచేయీ క‌ల‌పాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని, మ‌హిళ‌లు అన్ని రంగాల్లోనూ ఉన్న‌తంగా ఎదిగేందుకు తోడ్పాటునందించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. శుక్ర‌వారం జాతీయ బాలికా దినోత్స‌వం సంద‌ర్భంగా ఛైల్డ్ రైట్స్ అడ్వొక‌సీ ఫౌండేష‌న్ (సీఆర్ఏఎఫ్‌).. మ‌హిళా, శిశు సంక్షేమ …

Read More »