గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ మలేరియా దినోత్సవం (శనివారం) సందర్భంగా గుంటూరు నగర ప్రజలను సీజనల్, దోమకాటు వలన వ్యాప్తి చెందే వ్యాధుల నుండి కాపాడడానికి జిఎంసి ప్రజారోగ్య మలేరియా విభాగం ప్రత్యేక యాక్షన్ ప్లాన్ మేరకు కృషి చేస్తుందని, మలేరియా నియంత్రణ మరియు నిర్మూలన కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుని భాగస్వామ్యం కూడా ఎంతో అవసరమని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరవ్యాప్తంగా మలేరియా …
Read More »Monthly Archives: April 2026
అభివృద్ధి పనులు వేగంగా చేపట్టడానికి అధికారులు సమన్వయంతో కృషి చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరానికి కీలకమైన ప్రాజెక్ట్ లను రోజువారీ, నెలవారీ లక్ష్యాలను నిర్దేశించుకొని, అందుకు తగిన విధంగా వేగంగా చేపట్టడానికి సదరు శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. శుక్రవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్3, మిర్చి యార్డ్ దగ్గర ఫ్లైఓవర్ నిర్మాణం, గుంటూరు రూరల్ ప్రాంతాల్లో ఈఎల్ఎస్ఆర్ ల నిర్మాణం, శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణం, బిఆర్ స్టేడియం …
Read More »గుంటూరు నగరాన్ని `పోస్టర్ ఫ్రీ సిటీ` గా తీర్చిదిద్దుకోవడానికి అందరూ సహకరించాలి… : కమిషనర్ మయూర్ అశోక్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరాన్ని సుందరంగా మరియు “పోస్టర్ ఫ్రీ సిటీ”గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా నగరపాలక సంస్థ కఠిన చర్యలకు శ్రీకారం చుట్టిందని, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నగరంలో అనుమతి లేకుండా అక్రమంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ మరియు గోడలపై అంటించిన పోస్టర్లను తక్షణమే తొలగించాలని నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రోడ్లు, విద్యుత్ స్తంభాలు, డివైడర్లు, కార్యాలయాల గోడలు, బ్రిడ్జిల గోడలు మరియు …
Read More »5 శాతం రాయితీతో పన్ను చెల్లించడానికి 6 రోజులే గడువు కమిషనర్ మయూర్ అశోక్….
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి (2026-27) సంబందించిన ఆస్తి పన్నును ముందస్తుగా చెల్లించి పన్నుపై 5 శాతం, బకాయిలపై 50 శాతం వడ్డీ రాయితీ పొందేందుకు 6 రోజులే గడువు ఉందని, నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్నును ముందస్తుగా ఏక మొత్తంగా చెల్లించే వారికి 5 శాతం రాయితీ అవకాశాన్ని కల్పించిందని, ఈ …
Read More »నాణ్యతతో కూడిన అభివృద్ధి పనులే లక్ష్యం – కమిషనర్ మయూర్ అశోక్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో చేపడుతున్న ప్రతి అభివృద్ధి పనిలోనూ నాణ్యత అత్యంత ప్రధానమని, నాణ్యత ప్రమాణాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తే లేదని గుంటూరు నగర పాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లకు స్పష్టం చేశారు. శుక్రవారం నగరంలోని కలెక్టరేట్ రోడ్, చుట్టగుంట సెంటర్, కోదండరామయ్య నగర్, జిటి రోడ్, శాంతి నగర్, శ్రీనివాసరావుతోట, నల్లచెరువుల్లోని పలు ప్రాంతాల్లో పర్యటించి, క్షేత్రస్థాయిలో జరుగుతున్న అభివృద్ధి పనులను, పెండింగ్ సమస్యలను పరిశీలించి సంబందిత …
Read More »లేబర్ క్యాంపులలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలి: ఏడీసీ సీఎండీ డి.లక్ష్మీపార్థసారథి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజధాని అమరావతి నిర్మాణ పనుల కోసం ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న కార్మికులకు గుత్తేదారు సంస్థలు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ) ఛైర్పర్సన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డి.లక్ష్మీపార్థసారథి వారు ఖచ్చితమైన ఆదేశాలు జారీచేశారు. శుక్రవారం కురగల్లు గ్రామంలోని మేఘా, ఎన్-9 రోడ్డులోని బీఎస్ఆర్, తాళ్లాయపాలెంలోని ఎల్ అండ్ టి సంస్థల లేబర్ క్యాంపులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్మికులు, వారితో వచ్చిన కుటుంబ సభ్యులు ఉంటున్న గదులను పరిశీలించారు. అందులో మంచాలు, పరుపుల …
Read More »ఈ నెల 25న తుళ్లూరు గవర్నమెంట్ హైస్కూల్లో జాబ్ మేళా
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి & శిక్షణ శాఖ, ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC), CRDA సోషల్ డెవలప్మెంట్ అధికారుల సౌజన్యంతో అమరావతిలో ప్రతినెలా జాబ్ మేళాలు నిర్వహించడం జరుగుతోంది. APSSDC సమన్వయంతో అమరావతి, తుళ్లూరులోని గవర్నమెంట్ హైస్కూల్ ప్రాంగణంలో APCRDA అధికారులు రేపు శనివారం అనగా ఏప్రిల్ 25న జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు. రాజధాని ప్రాంతంలోని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం. తొలుత ఈ జాబ్ మేళా తుళ్ళూరులోని CRDA …
Read More »ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో జరిగిన సంఘటనలపై వినతిపత్రం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నేషనల్ మెడికల్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ తరుపున రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పి వి ఎస్ విజయభాస్కర్ ఆదేశాలు మేరకు ఈ రోజు ప్రతినిధి బృందం ఆంధ్రప్రదేశ్ స్టేట్ మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ ని విజయవాడలో కలిసి, ఇటీవల డాక్టర్ ఎన్ఆర్ఎస్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో జరిగిన సంఘటనలపై వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విద్యార్థినులు సమస్యను మీ దృష్టికి తీసుకువచ్చిన వెంటనే స్పందించి, మీరు స్వయంగా కళాశాలకు వెళ్లి విచారణ నిర్వహించడం …
Read More »ఈనెల 27న విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్యశిబిరం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ ఆధ్వర్యంలో పిళ్ళైయార్ ఆయుర్వేద వైద్యశాల సౌజన్యంతో ఈనెల 27వ తేదీ సోమవారం ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గాంధీనగర్లో విజయవాడ చాంబర్ హాలులో ఉచిత ఆయుర్వేద వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షులు గడ్డం బాల వెంకట రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వైద్యశిబిరంలో ఎముకల పటుత్వ పరీక్ష, నాడీ పరీక్ష, శరీర పరిస్థితి, రక్తపోటు, బరువు, …
Read More »తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు చేపట్టిన సమ్మె నేపథ్యంలో వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఏపీ పీటిడి ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పలిశెట్టి దామోదరరావు, ప్రధాన కార్యదర్శి జి.వి.నరసయ్య శుక్రవారం ఒక ప్రకటన ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉండటం వల్ల వారు గత్యంతరంలేక సమ్మెకు దిగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఈ సమ్మెలో పాల్గొంటున్న ఆర్టీసీ కార్మికులు ఆవేశంలో ఎటువంటి ఆగాయిత్యాలు, ఆత్మహత్యల వంటి …
Read More »
Prajavartha Online Telugu News