Daily Archives: August 8, 2026

పాముకాటు విషానికి… 108 అంబులెన్స్ లోనే విరుగుడు!

-అత్యవసర చికిత్స కోసం తొలిసారిగా యాంటీ స్నేక్‌ వీనం (ఏఎస్‌వీ) ఇంజక్షన్ ను అందుబాటులోనికి తెచ్చిన వైద్య ఆరోగ్యశాఖ -బాధితుల ప్రాణాలకు భరోసా -రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడి -వైద్యుల సూచన మేరకే ఏఎస్‌వీని.. బాధితులకు ఈఎంటీలు ఇచ్చేలా చర్యలు -ఎన్టీఆర్ వైద్య సేవ సీఈఓ చక్రధర్ బాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పాముకాటు బాధితుడిని ఆసుపత్రికి తరలించేలోపే విషప్రభావం తీవ్రం కాకుండా ముందస్తు చికిత్స అందించేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇకపై 108 …

Read More »

నీటి ప్రాజెక్టులపై నిర్లక్ష్యం

-తెలంగాణలో రాజీవ్‌గాంధీ ఎత్తిపోతల పథకంతో కృష్ణడెల్టా ఎడారి -102 జీవోతో పేద విద్యార్ధులకు వైద్య విద్య దూరం -పేదల బియ్యంలో రూ.20 వేల కోట్ల అక్రమాలు -మోదీకి భజనపరులుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ -విజయ పాలధర పెంపును ఉపసంహరించుకోవాలి -విలేకరుల సమావేశంలో జి ఈశ్వరయ్య విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ: రాష్ట్రంలో సాగునీరు, త్రాగునీరుకు అవసరమైన నీటి పారుదల ప్రాజెక్టులపై కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మండిపడ్డారు. శనివారం దాసరిభవన్‌లో ఏర్పాటు చేసిన …

Read More »

ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తజనం

-రెండవ శనివారం సెలవు కారణంగా ఆషాఢ సారె బృందాలతో కొండపై పండుగ వాతావరణం. -ఉదయం నుండే అంతరాలయ, వీఐపీ దర్శనాలు రద్దు. -ఉచిత దర్శనాలుగా మారిన అన్ని క్యూ లైన్లు. -​సాయంత్రం 6 గంటలవరకు 65వేల మందికి పైగా శ్రీ దుర్గమ్మవారి దర్శనం ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : రెండవ శనివారం సెలవు,ఆషాఢ మాస ఉత్సవాల వేళ ఇంద్రకీలాద్రి క్షేత్రం జనసముద్రంగా మారింది. ఉదయం 6 గంటల నుంచే ఆలయ పరిసరాలు భక్తజన సందోహంతో నిండిపోయాయి. ఘాట్ రోడ్,శ్రీ కనకదుర్గ నగర్ మార్గాల …

Read More »

పాట్ హోల్ రిపేర్ మెషిన్ ద్వారా శరవేగంగా రోడ్ల మరమ్మతులు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర పరిధిలోని రహదారులను సురక్షితంగా, గుంతలు లేకుండా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అధునాతన ‘పాట్ హోల్ రిపేర్ మెషిన్’ సహాయంతో రోడ్ల మరమ్మతు పనులను వేగవంతం చేసినట్లు గుంటూరు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఇటీవల కురిసిన వర్షాల కారణంగా నగరంలోని పలు ప్రధాన రహదారులు, అంతర్గత రోడ్లలో గుంతలు ఏర్పడి ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో పాట్ హోల్ రిపేర్ మెషిన్ …

Read More »

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టబోయే భవిష్యత్ ఉద్యమాలకు మద్దతు కోరిన ఆర్టీసీ జేఏసీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలో ఏఐటీయూసీ, సీఐటీయూ, ఏపిజేఏసి అమరావతి, హెడ్‌మాస్టర్స్ అసోసియేషన్ నాయకులను శనివారం కలిసిన ఆర్టీసి జేఏసీ ప్రతినిధులు ఆర్టీసీ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఏపీపీటీడీ (ఆర్టీసీ) ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టబోయే భవిష్యత్ ఉద్యమ కార్యాచరణకు మద్దతు ఇవ్వాలని కోరుతూ జేఏసీ ప్రతినిధులు ఈరోజు వివిధ ఉద్యోగ, కార్మిక సంఘాల నాయకులను కలిశారు. ఈ సందర్భంగా ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యస్.వెంకటసుబ్బయ్య, సీఐటీయూ …

Read More »

ఘనంగా నక్కా రాములు, కోటేశ్వరమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ 9వ వార్షికోత్సవం

-విద్యార్థులకు స్కాలర్షిపులు, దుస్తులు, పుస్తకాలకి పంపిణీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ నక్కా రాములు కోటేశ్వరమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ 9వ వార్షికోత్సవం మహోత్సవం గాంధీనగర్ బీఆర్‌టీఎస్ రోడ్డు వద్ద శారదా కళాశాలనందు శనివారం ఘనంగా జరిగింది. మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ అని నిరంతరం చాటి చెప్పే శీ నక్కారాములు కోటేశ్వరమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు నక్కా వీరభద్రరావు, రాజ్యలక్ష్మి దంపతులు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా కే.జీ.వి.సరిత డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్, కె.వి.వి.పరమేశ్వరరావు సీనియర్ న్యాయవాది, కుందా …

Read More »

స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్)పై విజయవాడలో జిల్లా స్థాయి వర్క్‌షాప్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్) కార్యక్రమం అమలు, గ్రామీణ పారిశుధ్యం, ఘన–ద్రవ వ్యర్థాల నిర్వహణ తదితర అంశాలపై కృష్ణా మరియు ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించిన జిల్లా స్థాయి వర్క్‌షాప్‌ను విజయవాడ తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో నిర్వహించారు. ఈ వర్క్‌షాప్‌కు కృష్ణా మరియు ఎన్టీఆర్ జిల్లాల నుండి డీడీఓలు, డీఎల్‌పీఓలు, ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలు మరియు పంచాయతీ కార్యదర్శులు గ్రేడ్–I నుంచి గ్రేడ్–V వరకు అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు …

Read More »

ఏపీటీడీసీ ఆధ్వర్యంలో విజయవాడ – వాడపల్లి- విజయవాడ ఒక రోజుటూర్ ప్యాకేజీ ప్రారంభం

-జండా ఊపి ప్రారంభించిన ఏపీటీడీసీ జనరల్ మేనేజర్ టి.ఎస్.వి. నారాయణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఆధ్వర్యంలో విజయవాడ- వాడపల్లి – విజయవాడ వాహన బస్సును శనివారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ఎదురుగా ఉన్న సెంట్రల్ రిజర్వేషన్ ఆఫీస్ కేంద్రం వద్ద ఏపీటీడీసీ జనరల్ మేనేజర్ టి.ఎస్.వి. నారాయణ లాంఛనంగా ప్రారంభించారు. భక్తులకు, పర్యాటకులకు అధునాతన సౌకర్యవంతమైన రవాణా, ఆహార వసతులతో ప్రణాళికాబద్ధమైన తీర్థయాత్ర అనుభవాన్ని అందించటంలో భాగంగా ప్యాకేజీని రూపకల్పన చేసినట్లు ఆయన అన్నారు. …

Read More »

రైజ్ రెక్క‌ల‌తో మ‌హిళ‌ల విజ‌య విహంగం

– విజ‌య‌వంతంగా న‌డుస్తున్న పారిశ్రామిక యూనిట్లు – గ్రామీణ ఇంక్యుబేష‌న్ సెంట‌ర్‌గా ఎదుగుతున్న ప్ర‌త్యేక కేంద్రం – శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు, వ‌ర్క్‌షాప్‌లు, జాబ్‌మేళాల నిర్వ‌హ‌ణ‌ – 5 వేల మందికి చేరువైన రైజ్ కేంద్రం కార్య‌క‌లాపాలు – ఒక కుటుంబం-ఒక పారిశ్రామిక‌వేత్త దార్శ‌నిక‌త దిశ‌గా అడుగులు – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ మ‌హిళ‌ల్లో దాగిఉన్న వ్యాపార నైపుణ్యాల‌ను వెలికితీసి, వారిని పారిశ్రామిక‌వేత్త‌లుగా తీర్చిదిద్దే దిశ‌గా రైజ్ కేంద్రం విశేషంగా కృషిచేస్తోంద‌ని.. గ్రామీణ ప్రాంతాల్లోని స్వ‌యం స‌హాయ‌క సంఘాల మ‌హిళ‌ల‌కు అవ‌స‌ర‌మైన శిక్ష‌ణ‌, మార్గ‌ద‌ర్శ‌క‌త్వం, …

Read More »

పూర్వ విద్యార్థుల సేవాభావం అభినందనీయం

-సిద్ధార్థ మెడికల్ కాలేజీకి రూ.75 లక్షల విలువైన 15 అత్యాధునిక వైద్య పరికరాల విరాళం -విద్యార్థులు, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పూర్వ విద్యార్థుల సహకారం -జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సిద్ధార్థ మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థులు తమ మాతృసంస్థపై ఉన్న మమకారంతో విద్యార్థులు, రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో రూ.75 లక్షల విలువైన 15 అత్యాధునిక వైద్య పరికరాలను విరాళంగా అందించిన కార్యక్రమానికి శనివారం జిల్లా కలెక్టర్ డాక్టర్ …

Read More »