మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
సమాచార పౌర సంబంధాల శాఖ ఉపసంచాలకులు యమ్ . వెంకటేశ్వర ప్రసాద్ జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారిగా సోమవారం తిరిగి విధుల్లో చేరారు. గత 3 నెలలు ఆర్జిత సెలవులో వెళ్లిన వారు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీని మినీ కాన్ఫరెన్స్ హాల్లో మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఇప్పటివరకు జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారిగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహించిన ఎస్ వి మోహన్ రావు నుండి వారు పదవి బాధ్యతలు స్వీకరించారు.
Prajavartha Online Telugu News