అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పహల్గాంలో ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ, ఈ దుశ్చర్యలో మృతి చెందిన వారికి సంతాప సూచకంగా జనసేన పార్టీ మౌన దీక్ష చేపట్టింది. ఇందులో భాగంగా ఈ రోజు ఉదయం నుంచి మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద శాసన మండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి, మృతులకు నివాళులు అర్పించి మౌన దీక్షకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎం.ఎస్.ఐ.డి.సి. చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, పార్టీ నేతలు కళ్యాణం శివ శ్రీనివాస్, మండలి రాజేష్, బేతపూడి విజయ శేఖర్, గంజి చిరంజీవి, రావి సౌజన్య తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News