విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) ను రాజకీయాలకతీతంగా అభిమానులు, కార్యకర్తలు, నాయకులు పరామర్శిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్ పర్సన్ జకియా ఖానం ఆదివారం సుజనా చౌదరి ను పరామర్శించారు. ఇటీవల ప్రమాదవశాత్తు గాయపడిన సుజనా కుడి భుజానికి శస్త్ర చికిత్స జరిగింది. హైదరాబాద్ లో తమ నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న ఆయన వద్దకు జకియా ఖానం తమ కుటుంబ సభ్యులతో వెళ్లి పరామర్శించారు. ఎమ్మెల్యే త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు.
Prajavartha Online Telugu News