నిరాధరణకు గురైన వృద్దుల సేవ‌లో న‌గ‌ర‌పాల‌క సంస్థ‌… : క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్

-14 మందికి సేవ‌లందిస్తున్న సింగ్ న‌గ‌ర్ వృధాశ్రమం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
న‌గ‌రంలో అనాధ లేదా నిరాధరణకు గురైన వృద్దులను గుర్తించి సింగ్ న‌గ‌ర్ న‌గ‌ర పాల‌క సంస్థ వృధాశ్రమం లో వారికి సంర‌క్ష‌ణ క‌ల్పిస్తున్న‌ట్లు న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ ఐ.ఏ.ఎస్ పేర్కొన్నారు. క‌మిష‌న‌ర్ అదేశాల మేర‌కు శానిటరీ సూపర్ వైజర్ ఆర్‌. ఓబేశ్వరరావు, సలీమ్ అహ్మద్, శానిటరీ ఇన్స్పెక్టర్ సురేంద్ర న‌గ‌రంలో ప‌ర్య‌టించి సోమ‌వారం వ‌న్‌టౌన్‌లో నిరాధరణకు గురైన 8 మంది వృద్దుల‌కు గుర్తించి వారికి అర్భ‌న్ హెల్త్ సెంట‌ర్ నందు వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించి, సింగ్ న‌గ‌ర్ లో రాజీవ్ న‌గ‌ర్‌ వృధాశ్రమం లో ఆశ్ర‌యం క‌ల్పించారు. పూర్తి ఆహ్లదకరమైన వాత‌వ‌ర‌ణంలో వృద్ద‌శ్ర‌యం నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. వృద్దులకు ఈ వయస్సుల్లో తమ ఇంట్లో ఉండాల్సిన వసతులను కల్పించడంతో పాటు వైద్య సేవ‌ల‌ను కూడా అందిస్తున్న‌ట్లు తెలిపారు. అనాధ లేదా నిరాధరణకు గురైన వృద్దుల స‌మాచారంను +91 98665 14199 తెలియ‌జేయాల‌న్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నేడు(ఈనెల 16) ఢిల్లీకి మంత్రి సవిత

-భారత్ టెక్స్-2025 లో పాల్గొన్ననున్నమంత్రి -రాష్ట్రంలో పెట్టుబడులకు పలు పారిశ్రామికవేత్తలతో భేటీ -చేనేత వస్త్రాల మార్కెటింగ్ విస్తరణకు చర్చలు అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *