విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ ఆదేశాలకు అనుగుణంగా ప్రాజెక్ట్ ఆఫీసర్ పర్యవేక్షణలో మంగళవారం సర్కిల్ -1 పరిధిలోని 110 మంది రిసోర్స్ పర్సన్స్ కు కోవిడ్ కిట్లు (హైజీన్ కిట్లను ) పంపిణీ చేసారు. సిబ్బంది యొక్క శ్రేయస్సును దృష్టిలో ప్రతి ఒక్కరికి ఉంచుకొని హ్యాండ్ వాష్, శానిటైజర్, మాస్క్ తో కూడిన కోవిడ్ కిట్లు పంపిణి చేసారు. కార్యక్రమములో టెక్నికల్ ఎక్స్పర్ట్ విజయకుమారి, సి.డి.ఓ దుర్గ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News