విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
49 వ డివిజన్లో పారిశుద్యం స్వచ్ఛమైన త్రాగునీరు విషయమై కార్పొరేటర్ బుల్లా విజయకుమార్ 49 వ డివిజన్ లొ వివిధ వీధులలో వాటర్ వర్క్స్ ఏఈ రాజేష్ మరియు సానిటరీ ఇన్స్పెక్టర్ మరియు సచివాలయం సిబ్బంది తో కలిసి పర్యవేక్షణ లో భాగంగా ప్రజలు ఎదురుకుంటున్న సమస్యలని తెలుసుకొని వాటిని సత్వరమే పరిష్కారించాలని అధికారులను ఆదేశించి ప్రజల కు ఈ వర్షాకాలం లో నీటికలుషిత నివారణపై ఎక్కువ శ్రద్ద చూపించి డివిజన్ ను నగరంలోనే అతి స్వచ్ఛ డివిజన్ గా అభిరుద్ది పరచటానికి అన్నివిధాలా తాను ఎల్లప్పుడూ ముందుంటానని అధికారులు, సిబ్బంది కూడా ఇదే ఆశయం తో పనిచేసి మన్ననలు పొందాలనీ పిలుపునిచ్చారు.
Prajavartha Online Telugu News