-నేడు జరిగిన ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం మోడ్రెన్ లాంగ్వేజ్ పేపర్ – II, జియోగ్రఫీ పేపర్ – II పబ్లిక్ పరీక్ష కు 18 మంది విద్యార్థులు హాజరు: ఆర్.ఐ. ఓ
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో నేడు జరుగుతున్న ఇంటర్మీడియట్ రెండవ సంవత్సర పబ్లిక్ పరీక్షలు గురు వారం ప్రశాంతంగా జరిగాయని, ఈ రోజు జరిగిన పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 18 మంది విద్యార్థులు హాజరయ్యారని ఆర్.ఐ. ఓ జీ.వి.ప్రభాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా 01 జనరల్ కేంద్రము లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మోడ్రెన్ లాంగ్వేజ్ పేపర్ – I, జియోగ్రఫీ పేపర్ – I పరీక్ష జరిగాయి. ఈ పరీక్షకు జనరల్ 18 మంది మొత్తం 18 మంది విద్యార్థులు హాజరు అయ్యారు. పరీక్షా కేంద్రాలలో త్రాగు నీటి వసతి, పోలీసు బందోబస్తు, మెడికల్ క్యాంపు, సీసీ కెమెరాల ఏర్పాటుతో పర్యవేక్షణ, విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు వీలుగా బస్సుల సౌకర్యం కల్పించామని ఆర్.ఐ. ఓ ఆ ప్రకటనలో తెలిపారు.
Prajavartha Online Telugu News