Breaking News

పదో తరగతి రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫలితాల విడుదల

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మార్చి 2025లో నిర్వహించిన SSC పబ్లిక్ పరీక్షల ఫలితాలు 23.04.2025న విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. అనంతరం, రీ-వెరిఫికేషన్ మరియు రీ-కౌంటింగ్ దరఖాస్తులు పాఠశాలల లాగిన్‌లో 24.04.2025 నుండి 01.05.2025 వరకు అందుబాటులో ఉంచబడ్డాయి. దీనికి సంబంధించి 66,421 జవాబు పత్రాలు రీ-వెరిఫికేషన్ మరియు రీ-కౌంటింగ్ కోసం విద్యార్థులచే దరఖాస్తు చేశారు. 66,421 జవాబు పత్రాలలో, మొత్తం 47,484 జవాబు పత్రాల ఫలితాలు శుక్రవారం విడుదల చేసినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ డా. కె.వి.శ్రీనివాసులు రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మిగిలిన ఫలితాలు కూడా త్వరలో విడుదల చేస్తామని తెలిపారు. ఈ రీ-వెరిఫికేషన్ మరియు రీ-కౌంటింగ్ ఫలితాలు పాఠశాలల లాగిన్‌లో అందుబాటులో ఉంచబడతాయి. సంబంధిత ప్రధానోపాధ్యాయులు వాటిని డౌన్‌లోడ్ చేసి, ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేసిన వెంటనే సంబంధిత విద్యార్థులకు సాఫ్ట్‌కాపీ/హార్డ్‌కాపీ రూపంలో అందజేయాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ డా. కె.వి.శ్రీనివాసులు రెడ్డి కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *