Breaking News

Daily Archives: April 16, 2025

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అర్హులైన అందరికీ ఈ-శ్రమ్ కార్డులు…

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకాశంజిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ ని భారతీయ జనతా మజ్దూర్ సెల్ (బీజేఎంసీ) రాష్ట్ర అధ్యక్షులు షేక్. ఖలీఫాతుల్లా బాషా, రాష్ట్ర సహాయ కార్యదర్శి షేక్. సిద్దాంబీలు మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్బంగా వారి మధ్యన కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ఈ-శ్రమ్ కార్డుల యొక్క ప్రయోజనాలు చర్చకు రావడం జరిగింది. ఈ-శ్రమ్ కార్డు పొందిన లబ్దిదారులకు కేంద్ర ప్రభుత్వం రెండు లక్షల రూపాయలు ఏదైనా ప్రమాదం జరిగి మరణించిన లేదా పూర్తి స్థాయిలో …

Read More »

యువతకు ఉపాధి, రాష్ట్రాభివృద్ధి తోడ్పాటు అందించేలా మైనింగ్ రంగాన్ని తీర్చిదిద్దుతాం

– అంతర్జాతీయ స్థాయిలో మన మైనింగ్ అభివృద్ధికి అవకాశాలు – గత ఐదేళ్లు రాష్ట్రంలో మైనింగ్ రంగంలో దోపిడీ – యువ పారిశ్రామిక వేత్తలకు మైనింగ్‌లో అపార అవకాశాలు – ఏపీలోని క్రిటికల్ మినరల్స్ విషయంలో ప్రత్యేక పాలసీ – భూగర్భ వనరుల్ని భవిష్యత్ ఉపాధి కల్పనకు వాడుకోవాలి – మైనింగ్ వ్యవస్థలో సమూల మార్పులు అవసరమన్న మంత్రి కొల్లు రవీంద్ర అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : మైనింగ్ రంగంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించి సరైన ప్రణాళికతో ముందుకు వెళ్తే అద్భుతాలు సృష్టించే …

Read More »

దానాల్లో కెల్లా అన్నదానం గొప్పది

–మాచవరంలో అన్నదానాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీరామ నవమి సందర్బంగా తూర్పు నియోజకవర్గ పరిధిలోని మాచవరంలో శ్రీరామ నవమి కమిటీ ఆధ్వర్యంలో బుధవారం అన్నదాన కార్యక్రమం జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ హజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ పాల్గొన్నారు. సుమారు పది వేల మంది భక్తులు ఈ అన్నదానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ మాట్లాడుతూ గత 15 …

Read More »

మణిపాల్‌లో సౌత్‌ ఏషియన్‌ లివర్‌ ప్రోగ్రామ్‌ కాలేయ మార్పిడి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలోని మణిపాల్‌ హాస్పిటల్‌ సౌత్‌ ఏషియన్‌ లివర్‌ ఇన్‌స్టిట్యూట్‌ భాగస్వామ్యంతో, కాలేయ మార్పిడిలో ఈఆర్‌ఎఎస్‌కి కేంద్రంగా మారింది. కాలేయ మార్పిడి తర్వాత రికార్డు స్థాయిలో కేవలం 5 రోజుల్లోనే డిస్చార్ట్‌ చెయ్యడం అనేది దేశంలోనే ‘మొదటిసారి’. శస్త్రచికిత్స తర్వాత మెరుగైన రికవరీ అనే ఒక విప్లవం ప్రారంభమయ్యింది. ఇది పురాతన శస్త్రచికిత్సా మూస పద్ధతులకు స్వస్తి పలికింది. విజయవాడలోని మణిపాల్‌ హాస్పిటల్లో లివర్‌ ట్రాన్స్‌ ప్లాంట్‌ ప్రోగ్రామ్‌ హెడ్‌, ప్రఖ్యాత లివర్‌ సర్జన్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ టామ్‌ …

Read More »

మత బోధకుడు ప్రవీణ్‌ పగడాల మృతిపై సీబీఐ విచారణ జరపాలి

-ఏపీ హైకోర్టులో పిల్‌ దాఖలు చేసిన కేఏ పాల్‌ -రాష్ట్రంలో ఎన్ని చర్చిలు ఉన్నాయో పవన్‌కళ్యాణ్‌ ఎందుకు ఆరా తీశాడు -ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : క్రైస్తవ మత బోధకుడు ప్రవీణ్‌ పగడాలది హత్య నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌ అన్నారు. విజయవాడ హోటల్‌ ఐలాపూర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆ వీడియోలో ఉన్నది అసలు ప్రవీణ్‌ కాదని డూప్‌ ప్రవీణ్‌ 22 రోజులు …

Read More »

నవయుగ వైతాళికుడు కందుకూరి

-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు జాతి గ‌ర్వించ‌ద‌గ్గ మ‌హోన్న‌త వ్య‌క్తి కందుకూరి వీరేశ‌లింగం పంతులు అని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. విరేశలింగం పంతులు జయంతిని పురస్కరించుకొని బుధవారం ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. సాహితీవేత్త‌గా, సంఘ సంస్క‌ర్త‌గా కందుకూరి వీరేశ‌లింగం పంతులు అందించిన సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయమ‌ని …

Read More »

జిల్లా స‌మ‌గ్రాభివృద్ధిలో లీడ్ బ్యాంకు కీల‌క‌పాత్ర‌

-జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : లీడ్ బ్యాంక్ యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విజ‌య‌వాడ నూత‌న రీజ‌న‌ల్ మేనేజ‌ర్‌, ఎన్‌టీఆర్ జిల్లా డీసీసీ-డీఎల్ఆర్‌సీ క‌న్వీన‌ర్ ఎంవీ తిల‌క్ బాధ్య‌త‌లు స్వీక‌రించిన అనంత‌రం బుధ‌వారం జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ను క‌లెక్ట‌రేట్‌లో మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు.క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌.. నూత‌న క‌న్వీన‌ర్‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. జిల్లా స‌మ‌గ్రాభివృద్దిలో లీడ్ బ్యాంక్‌ది కీల‌క పాత్ర అని.. డీసీసీ-డీఎల్ఆర్‌సీ క‌న్వీన‌ర్‌గా సంక్షేమ ప‌థ‌కాలు, అభివృద్ధి కార్య‌క్ర‌మాల ఫ‌లాలు ల‌బ్ధిదారుల‌కు పూర్తిస్థాయిలో చేరువ‌చేయ‌డంలో, వివిధ ర‌కాల …

Read More »

రెవెన్యూ సేవ‌ల ద‌ర‌ఖాస్తులపై ప్ర‌త్యేక దృష్టిపెట్టాం

-స‌మ‌స్య‌ల స‌త్వ‌ర ప‌రిష్కారానికి కృషిచేస్తున్నాం -క్షేత్ర‌స్థాయి సిబ్బందికి శిక్ష‌ణ ఇస్తున్నాం -రీస‌ర్వే కార్య‌క‌లాపాల‌ను ల‌క్ష్యాల‌మేర‌కు వేగ‌వంత చేస్తున్నాం -జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం రెవెన్యూ సేవ‌ల‌కు సంబంధించిన ద‌ర‌ఖాస్తుల స‌త్వ‌ర ప‌రిష్కారానికి చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని, వివిధ అంశాల‌పై స్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌న‌తో స‌మ‌స్య‌ల‌ను వీలైనంత త్వ‌ర‌గా ప‌రిష్క‌రించేందుకు కృషిచేస్తున్నామ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. రాష్ట్ర భూ ప‌రిపాల‌న చీఫ్ క‌మిష‌న‌ర్ (సీసీఎల్ఏ), ఎన్‌టీఆర్ జిల్లా ప్ర‌త్యేక అధికారి జి.జ‌య‌ల‌క్ష్మి బుధ‌వారం …

Read More »

నగరాభివృద్ధి కై శాకాధిపతులతో సమీక్ష సమావేశం

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర అభివృద్ధికై శాఖాధిపతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. బుధవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల తమ చాంబర్లో శాఖాధిపతులతో ఈ సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరాభివృద్ధికై జరుగుతున్న పనులను సమీక్షించారు జరగవలసిన పనులను చర్చించారు, ఇంజనీరింగ్ సిబ్బంది త్వరగా సాంక్షన్ అయిన ఇంజనీరింగ్ పనులను పూర్తి చేయాలని, శాంక్షన్ అవటమే కాకుండా కార్యాచరణలో కూడా అభివృద్ధి కనపడాలని అధికారులను ఆదేశించారు. విజయవాడ నగరపాలక సంస్థ …

Read More »

అన్న క్యాంటీన్ వసతుల్లో ఎటువంటి లోపం ఉండకూడదు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అన్న క్యాంటీన్ వసతుల్లో ఎటువంటి లోపం ఉండరాదని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం హెచ్ బి కాలనీలో గల అన్న క్యాంటీన్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో గల 11 అన్నా క్యాంటీన్ ల నోడల్ ఆఫీసర్లు ప్రతిరోజు అన్న క్యాంటీన్ ని పరిశీలించాలని అక్కడ వసతుల్లో ఎటువంటి లోపం …

Read More »