రాయచోటి, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీ స్టేట్ ఎక్స్ సర్వీస్మెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం రాయచోటి, అన్నమయ్య జిల్లా ఏపీ స్టేట్ ఎక్స్ సర్వీస్మెన్ వెల్ఫేర్ ఆసోసియేషన్ అధ్యక్షులు మోటూరి శంకరరావు ఆధ్వర్యంలో సభ్యత్య నమోదు కార్యక్రమం జరిగింది. ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో మాజీ సైనికులు హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సమావేశానికి రాయచోటి, అన్నమయ్య జిల్లా మాజీ సైనికులు గురుగింజ బాలాజీ, శివ ప్రసాద్ రాజ్, ఎ. శేఖరయ్య నాయుడు, ఎస్. చలపతి, ఆర్ త్రివిక్రమ్ రాజు, ఆదినారాయణ రెడ్డి, గోపాల్ రెడ్డి, రాజా రెడ్డి, షేక్ మహబూబ్ పీరా తదితరులు హాజరయ్యారు.
,
Prajavartha Online Telugu News