విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్.. శూన్య పేదరికం, పీ-4 విధానం తదితరాలపై జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీసీకి జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, సీపీవో వై.శ్రీలత, గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి, జిల్లా ఉద్యాన అధికారి పి.బాలాజీ కుమార్, డీపీవో పి.లావణ్య కుమారి, విజయవాడ నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ డి.చంద్రశేఖర్ వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. ప్రభుత్వ, ప్రయివేటు, ప్రజల భాగస్వామ్యంతో ప్రతి ఇంటినీ ప్రగతి పథంలో నడిపించి.. అందరి జీవితాల్లో వెలుగులు నింపాలనే పీ-4 పాలసీ గురించి సీఎస్ వివరించారు. పేదరికాన్ని సమూలంగా దూరం చేసే దిశగా ప్రభుత్వ ఆలోచనలను వివరించారు.
Prajavartha Online Telugu News