-ప్రతి నెలా మూడవ శనివారం నిర్వహించే స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా నేడు స్థానిక కలెక్టరేట్ ఆవరణలో కలెక్టర్ కార్యాలయం సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించిన డిప్యూటీ స్పెషల్ కలెక్టర్ దేవేందర్ రెడ్డి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
శనివారం ఉదయం కలెక్టరేట్ ఆవరణం నందు ప్రతి నెలా మూడవ శనివారం నిర్వహించే స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా నేడు స్థానిక కలెక్టరేట్ ఆవరణలో కలెక్టర్ కార్యాలయం సిబ్బంది చేత రానున్న కాలంలో ప్రమాదకరమైన పదార్థాలు పెయింట్స్ మరియు ద్రావకాలు మోటర్ ఆయిలు, పాదరసం కలిగిన వ్యర్ధాలు, పురుగు మందులు, కలుపు సంహారకాలు, ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్లు టెలివిజన్ మొబైల్ ఫోన్, రిఫ్రిజిరేటర్ ల భాగాలు, బ్యాటరీలు, మందు గుండు సామాగ్రి, కారు బ్యాటరీలు తదితరాలు ప్రమాదకరమైన వ్యర్థాలుగా ఎరుపు రంగు బుట్టలలో వేయాల్సి ఉంటుంది అని తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పెషల్ కలెక్టర్ దేవేందర్ రెడ్డి ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో భారతి, సిపిఓ, డాక్టర్ బాలకృష్ణ నాయక్, డిడి సోషల్ వెల్ఫేర్, ఏ డి ల్యాండ్ అండ్ సర్వే, ఇతర శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News