Breaking News

ప్రశాంత వాతావరణంలో జిల్లాలో పది పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం..

-అందరూ విద్యార్థినీ విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని కోరుకుంటున్నా….
-సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకొని.. ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయండి …. ఆల్ ది బెస్ట్: జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ ఎస్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా వ్యాప్తంగా పది పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థినీ విద్యార్థులు పరీక్షా సమయం 9:30 గంటలకు అర్ధగంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని హడావిడి లేకుండా ఒత్తిడి కి లోను కాకుండా పరీక్షలు రాయాలని, జిల్లా లో ప్రశాంత వాతావరణంలో పది పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని దూర ప్రాంత విద్యార్థులు వారి హాల్ టికెట్ ను బస్సు లో చూపించి ఉచితం గా ప్రయాణించి సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోగలరని తెలుపుతూ పదవ తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థిని విద్యార్థులు అందరికీ శుభా కాంక్షలు మరియు ఆల్ ది బెస్ట్ తెలిపిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *