విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చలో బస్తీ అభియాన్ కార్యక్రమంలో భాగంగా విద్యాధరపురంలో ఎమ్మెల్యే సుజనా మొక్కలు నాటారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 39 వ డివిజన్ లో మాలెం పాటి భాస్కరరావు పాఠశాల వద్ద ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, కూటమినేతలతో కలిసి ఎమ్మెల్యే సుజనా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
గావ్ బస్తీ చలో అభయాన్ లో భాగంగా అంబేద్కర్ జయంతి రోజున మొక్కలు నాటడం సంతోషకరమన్నారు.
ప్రధాని మోడీ పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారన్నారు. అంబేద్కర్ ఆశయాలను, సిద్ధాంతాలను భారతీయ జనతా పార్టీ కొనసాగిస్తుందని సుజనా చౌదరి తెలిపారు.
Prajavartha Online Telugu News