గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గ్రీస్ దేశం నందు ఐటి మరియు టెలికం సేవల కింద విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకున్న పురుష అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు గుంటూరు జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి కొండా సంజీవరావు తెలియజేశారు. కావున విదేశాల్లో ఉద్యోగ చేయాలని ఆసక్తి ఉన్న యువకులు ఈ క్రింద తెలియజేసిన అర్హతలను బట్టి దరఖాస్తు చేసుకోవాల్సి దిగా కోరుచున్నాము
అర్హత ప్రమాణాలు:
• ఉద్యోగ పాత్ర : ఐటీ & టెలికాం సేవలు
• విద్య అర్హత/సర్టిఫికేషన్ : డాట్ నెట్ డెవలపర్లు & MS SQL డెవలపర్లు.
• వయోపరిమితి : 35 సంవత్సరాల వరకు
• అనుభవం : కనీసం 5 సంవత్సరాలు
జీతం వివరాలు:
• జీతం : 28.000 యూరోలు నికర/సంవత్సరానికి సుమారు (రూ.26,00,000/-)
• కాంట్రాక్ట్ వ్యవధి : కనీసం రెండేళ్లు
• ఉద్యోగ స్థానం : కంపెనీ ప్రధాన కార్యాలయం కల్లిథియా
• ఎంపిక ప్రక్రియ : ఇంగ్లీష్ ప్రావీణ్యత పరీక్ష & సాంకేతిక పరిజ్ఞానం నైపుణ్యాల అంచనా.
ప్రయోజనాలు:
• పని దినాలు : సోమవారం నుండి శుక్రవారం వరకు
• సెలవు ప్రయోజనాలు : సంవత్సరానికి 20 రోజులు
• కాంట్రాక్ట్ తర్వాత ఉద్యోగ అవకాశం : కాంట్రాక్ట్ పునరుద్ధరణ ఎంపికలు.
• సామాజిక భద్రత మరియు బీమా మొదలైనవి : అందించబడ్డాయి
• వసతి : ప్రాంగణానికి దగ్గరగా ఉన్న 2 బెడ్రూమ్ల షేర్డ్ ఫ్లాట్లో అందించబడింది.
అభ్యర్థులు చెల్లించాల్సిన ఛార్జీలు:
• గమ్యస్థాన దేశంలో ఆహారం & రవాణా
• వైద్య పరీక్ష తప్పనిసరి
• వీసా మరియు విమాన ఛార్జీలు
ఉత్సాహవంతులైన అభ్యర్థులు జూన్ 10వ తేదీలోగా https://naipunyam.ap.gov.in/user-registration?page=program-registration లింక్ నందు రిజిస్ట్రేషన్ చేసుకోగలరు మరియు మీ సివిని skillinternational@apssdc.in కు షేర్ చేయండి. మరిన్ని వివరముల కొరకు 9988853335, 8712655686, 8790118349, 8790117279, మరియ GVS Saikumar (8074597926) నెంబర్లు నందు సంప్రదించగలరు.
Prajavartha Online Telugu News