అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజారాజధాని అమరావతిలో చేపట్టిన వరద నిర్వహణ పనులను APCRDA అడిషనల్ కమిషనర్ కె. కార్తీక్, ఐఏఎస్ శనివారం పరిశీలించారు. అమరావతిలో పాలవాగు అభివృద్ధి పనులు జరుగుతున్న పలు ప్రాంతాలను కార్తీక్ పరిశీలించారు. పనుల పురోగతిని APCRDA, ADCL విభాగ అధికారులు.. కార్తీక్ కి వివరించారు. పరిశీలన అనంతరం, ఆయా పనులను నాణ్యతతో పాటు వేగంగా పూర్తి చేయాలని కార్తీక్ అధికారులకు పలు సూచనలు చేశారు. వర్షాకాలం సమీపిస్తున్నందున వర్షపు నీరు వెళ్లే మార్గాలను కార్తీక్ పరిశీలించి, ఆయా మార్గాలలో జరుగుతున్న పాలవాగు అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు.
Prajavartha Online Telugu News