Breaking News

పరిసరాలలో నీరు నిల్వ లేకుండా చూడాలి…


రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం ఉండేశ్వరపురం గ్రామములో ఒక డెంగ్యూ కేసు నమోదు కావడంతో దానిని పరిశీలించుటకు జిల్లా మలేరియా అధికారి జి.వీర్రాజు మరియు మలేరియా సబ్ యూనిట్ అధికారి రాజు రావడం జరిగినది. ఆ డెంగ్యూ కేసు వివరాలను సీతానగరం PHC హెల్త్ సూపర్వైజర్ K. శ్రీనివాసరావు మలేరియా అధికారి కి వివరించుట జరిగినది. అనంతరం సబ్ యూనిట్ అధికారి రాజు  ఆ కేసు చుట్టుపక్కల పరిసరాలను, దోమల ఆవాస ప్రాంతాలను పరిశీలించుట జరిగినది. జిల్లా మలేరియా అధికారి స్థానిక ప్రజలతో ఉపయోగించని రుబ్బురోలు, పాత సీసాలు, జాడీలు , డిస్పోజబుల్ గ్లాసులు మొదలగు వాటిలో నీరు చేరి వాటిలో దోమలు వృద్ధి చెందుతాయని, వాటి వల్ల మలేరియా , డెంగ్యూ జ్వరాలు వస్తాయని వివరించుట జరిగినది. జులై నెల నుండి వర్షాలు ఎక్కువగా కురవడం వలన దోమలు బాగా వృద్ధి చెందుతాయని కాబట్టి పరిసరాలలో నీరు నిల్వ లేకుండా చూడాలని తెలియజేయుట జరిగినది. అనంతరం జిల్లా మలేరియా అధికారి  ANM మరియు MLHP ల రికార్డులను పరిశీలించి తగిన సూచనలను ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమానికి హెల్త్ సూపర్వైజర్ కే శ్రీనివాసరావు తో పాటుగా Health Assistants స్వామి ,B. రూప్ కుమార్, ANM లు M.పద్మ ,B.కుమారి, MLHPలు షేక్ మౌనిక, మరియు బి. శైలజ, MLHP లు, ఆశా కార్యకర్తలు మరియు ఉండేశ్వరపురం గ్రామపంచాయతీకి చెందిన విటల్ పాల్గొనుట జరిగినది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *