విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా అనాథ బాలలకు పండ్లు రొట్టెలు శనివారం పంపిణీచేశారు. డిసెంబరు10 వ తేదీ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఇండియా జాతీయ కమిషనర్ చెన్నుపాటి శ్రీకాంత్ ఆదేశాల మేరకు శనివారం గాంధీనగర్ సాంబమూర్తి రోడ్డులోని ఎస్కేసీవీ చిల్డ్రన్స్ ట్రస్ట్ లోని అనాథ బాలలకు రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉమెన్ పోర్ట్ ప్రెసిడెంట్ కొండా జయలక్ష్మి, ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షురాలు ఆయేషా, రబ్బానీ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News