Breaking News

Tag Archives: vijayawada

ప్రభుత్వాసుపత్రి సర్వతోముఖాభివృద్ధికి కృషి..

– కొత్త సూపరింటెండెంట్ డాక్టర్ మెట్లపల్లి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ప్రభుత్వాసుపత్రి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయగలనని నూతనంగా బాధ్యతలు చేపట్టిన గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం అధిపతి డాక్టర్ మెట్లపల్లి జగన్ మోహన్ రావు అన్నారు. ప్రస్తుత అవసరాలకు తగ్గట్లుగా అన్ని విభాగాలను బలోపేతం చేసి అన్ని వర్గాలు, అన్ని వయసుల వారికి ప్రభుత్వాసుపత్రిలో అందుబాటులో ఉండేలా, అలాగే తమ వంతుగా విశేష వైద్య సేవలు లభించేలా వైద్యులు, సిబ్బంది సహకారంతో తన వంతు కృషి చేయగలను అన్నారు. డాక్టర్ జగన్మోహన్ రావు …

Read More »

ఈ – రూపీ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా సోమవారం ఆవిష్కరించిన ఈ – రూపీ (ప్రీపెయిడ్ ఇ-వోచర్) ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ విజయవాడ రాజ్ భవన్ నుండి వర్చువల్ మోడ్‌లో పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్‌లు, లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్రమంత్రులు, ముఖ్య కార్యదర్శులు, ఇతర ప్రముఖులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ డిజిటల్ పాలన, భవిష్యత్ సంస్కరణలకు ఈ – రూపీ ఒక ఉదాహరణ అన్నారు. ఈ – రూపీ …

Read More »

జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 142 వ జయంతి నివాళులర్పించిన సబ్ కలెక్టర్ జి.ఎస్.ఎస్.ప్రవీణ్ చంద్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత జాతీయ పతాక రూపకర్త,స్వాతంత్య్ర సమర యోధులు పింగళి వెంకయ్య నిత్య స్మరణీయులని విజయవాడ సబ్ కలెక్టర్ జి.ఎస్.ఎస్. ప్రవీణ్ చంద్ అన్నారు. సోమవారం పింగళి వెంకయ్య 142 వ జయంతి సందర్భంగా స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం లో పింగళి వెంకయ్య చిత్రపటానికి సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిన జాతీయ జెండాను రూపొందించిన పింగళి వెంకయ్య గొప్ప దేశభక్తుడని …

Read More »

అర్జీదారుడు సంతృప్తి చెందేలా సమస్యలను పరిష్కరించండి…

-వివిధ సమస్యల పరిష్కరం కోసం అందిన 57 అర్జీలు -సబ్ కలెక్టర్ జి.ఎస్.ఎస్.ప్రవీణ్ చంద్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యలను వేగవంతంగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంత్యంత ప్రాధాన్యత ఇస్తున్న “స్పందన” కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీదారుల సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులకు సబ్ కలెక్టర్ జి.ఎస్.ఎస్.ప్రవీణ్ చంద్ సూచించారు.. సోమవారం విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ “స్పందన” కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ జి.ఎస్.ఎస్.ప్రవీణ్ చంద్ …

Read More »

విభిన్న ప్రతిభావంతులలో ఆత్మసైర్యాన్ని నింపాలన్నదే లక్ష్యం…

-విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి రెండేళ్లలో 37కోట్లు మంజూరు -16.5 కోట్లతో 1750 మందికి మూడు చక్రాల మోటరైజ్డ్ స్కూటర్ల పంపిణీ -నూతన ఛైర్‌పర్సన్ ముంతాజ్ పఠాన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి గత రెండేళ్ళల్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి 37 కోట్ల రూపాయలు మంజూరు చేయటం జరిగిందని ఉపకరణాలతో పాటు ఈ ఏడాది 16. 5 కోట్ల రూపాయల ఖర్చుతో 1750 మంది మూడు చక్రాల మోటరైజ్డ్ స్కూటర్‌ను పంపిణీ చేయనున్నట్లు విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సహాయ …

Read More »

ఎపిఎండిసి చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన  షమీమ్ అస్లాం.

-ఘనంగా స్వాగతం పలికిన ఎపిఎండిసి అధికారులు -సీఎం శ్రీ వైయస్ జగన్ ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించారు -మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపి  మిధున్‌ రెడ్డిల సహకారంతో ముందుకు సాగుతాం -రాష్ట్రంలోనే ఎపిఎండిసిని ప్రగతి పథంలో నిలిపేందుకు కృషి -ఖనిజాభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి, యువతకు ఉపాధి కల్పనకు ప్రాధాన్యత -షమీమ్ అస్లాం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ (ఎపిఎండిసి) చైర్‌పర్సన్‌గా షమీమ్ అస్లాం సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా విజయవాడ లోని ఎపిఎండిసి …

Read More »

మూడు సర్కిల్ కార్యాలయములలో జోనల్ కమిషనర్ల అధ్యక్షతన “స్పందన”

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఎ.ఎస్ ఆదేశాల మేరకు సర్కిల్ -1 నందు జోనల్ కమిషనర్ డా.రవి చంద్ చే నిర్వహించిన స్పందన కార్యక్రమములో ఉద్యానవన విభాగమునకు సంబందించి 1 అర్జి సమర్పించుట జరిగింది. సర్కిల్ -2 నందు జోనల్ కమిషనర్ కె.వి.ఆర్.ఆర్.రాజుచే నిర్వహించిన స్పందన కార్యక్రమములో ప్రజారోగ్య శాఖ -1, పట్టణ ప్రణాళిక విభాగమునకు  సంబంధించి-1  అర్జి మొత్తం 2 అర్జిలు సమర్పించుట జరిగింది.  సర్కిల్ -3 నందు జోనల్ కమిషనర్ ఎల్.పార్ధసారధి చే నిర్వహించిన …

Read More »

ప్రజలు సమస్యల పరిష్కార వేదిక స్పందన…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుంచి వచ్చిన సమస్యల అర్జీల‌ను క్షేత్ర స్థాయిలో పరిశిలించి సత్వరమే పరిష్కరించాలని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ అధికారులను ఆదేశించారు. విజ‌య‌వాడ నగర పాలక సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమములో మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి స్వయంగా ప్రజల నుంచి అర్జీల‌ను స్వీకరించారు. ప్ర‌జ‌లు సమర్పించిన అర్జీలను పరిశీలించి వాటిని సత్వరమే పరిష్కారించేలా చూడాలని ఆదేశించారు. కార్యక్రమములో పట్టణ ప్రణాళిక -4, పబ్లిక్ హెల్త్ …

Read More »

ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి  పాలన… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేతుల మీదుగా రూ. 7.41 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  పాలన సాగిస్తున్నారని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు  అన్నారు. ఆంధ్రప్రభ కాలనీలోని ఎమ్మెల్యే  కార్యాలయంలో 35 మంది లబ్ధిదారులకు మొత్తం రూ. 7 లక్షల 41 వేలకు సంబంధించిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు  మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి  ముఖ్యమంత్రి …

Read More »

సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 57, 60, 61వ డివిజన్ లలో నూతనంగా మంజూరైన పెన్షన్ల పంపిణీ… 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :  సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 57, 60, 61వ డివిజన్ లలో నూతనంగా మంజూరైన పెన్షన్ల పంపిణీ జరిగింది.   60వ డివిజన్ వాంబే కాలనీలోని 262 వ వార్డు సచివాలయం, 57వ డివిజన్ లోని 233వ వార్డు సచివాలయాలలో కార్యక్రమ నిర్వహించారు. 57వ డివిజన్ లో 22 మంది, 60 వ డివిజన్ లో 9 మంది, 61వ డివిజన్ లో 5 మంది అర్హులకు నూతన పెన్షన్లు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా  ఎమ్మెల్యే మల్లాది విష్ణు  మాట్లాడుతూ రాష్ట్రంలో …

Read More »