Breaking News

Tag Archives: vijayawada

గొల్లపూడి వన్ సెంటర్‌లో కేడీసీసీ బ్యాంక్⁠ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మైలవరం నియోజకవర్గం గొల్లపూడి వన్ సెంటర్‌లో కేడీసీసీ బ్యాంక్ (కృష్ణాజిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని గొల్లపూడి పీఏసీఎస్ చైర్మన్ నూతలపాటి శ్రీనివాసరావు, గొల్లపూడి మార్కెట్ చైర్మన్ నర్రా వాసు మరియు సీనియర్ నాయకులతో కలిసి ప్రారంభించారు. మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం ఆదేశాల మేరకు ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుతం పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని …

Read More »

ఆప‌ద‌లో అండ‌గా… సేవ‌ల్లో మిన్న‌గా రెడ్‌క్రాస్

– అవ‌స‌రంలో ఆదుకునే చేయి… రెడ్‌క్రాస్ సేవా స్పూర్తి – ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స‌మాజంలో ఆప‌ద స‌మ‌యంలో ముందుండి సేవ‌లు అందిస్తూ మాన‌వ‌త్వానికి ప్ర‌తీక‌గా నిలుస్తున్న సంస్థ రెడ్‌క్రాస్ అని, అవ‌స‌రంలో ఉన్నవారికి అండ‌గా నిల‌బ‌డ‌టం, విప‌త్తుల స‌మ‌యంలో సాయం అందించ‌డం, ర‌క్త‌దానం వంటి కార్య‌క్ర‌మాల ద్వారా రెడ్‌క్రాస్ విశిష్ట సేవ‌లు అందిస్తోంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా మానవతా సేవలకు ప్రతీకగా నిలిచిన రెడ్‌క్రాస్ వ్యవస్థాపకులు హెన్రీ డ్యూనాంట్ …

Read More »

డ్రోన్ ఎల్ఈడీ ప్రదర్శనతో స్వచ్ఛ సర్వేక్షన్ ఓటింగ్‌ మరియు జనగణన పై ప్రజల్లో అవగాహన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారం సాయంత్రం ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం, బందర్ రోడ్లు డ్రోన్ ఎల్ఈడి ద్వారా స్వచ్ఛ సర్వేక్షన్ ఓటింగ్ పై వినూత్నంగా ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షన్ 2025-26లో భాగంగా ప్రజల అభిప్రాయ సేకరణ ప్రారంభమైందని తెలిపారు. నగర పరిశుభ్రత, పారిశుధ్య సేవలు, చెత్త సేకరణ, మరుగుదొడ్లు, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై ప్రజలు తమ అభిప్రాయాలను అధికారిక లింక్ …

Read More »

జన గణనను వేగవంతం చేయండి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జన గణనను వేగవంతం చేయాలని సిటీ సెన్సెస్ ఆఫీసర్ మరియు విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ ఏ. రవీంద్రరావు అన్నారు. శుక్రవారం ఉదయం వన్ టౌన్ లో గల తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జన గణన చేసే ఎన్యుమేరేటర్లు మరియు సూపర్వైజర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ, జన గణన దేశ అభివృద్ధి ప్రణాళికలకు, సంక్షేమ పథకాల అమలుకు ఎంతో కీలకమైన ప్రక్రియ అని తెలిపారు. ప్రతి ఇంటిని సందర్శించి సరైన వివరాలను …

Read More »

దోమల వల్ల కలిగే వ్యాధుల నివారణ కొరకు ఫ్రైడే డ్రై డే

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దోమల వల్ల కలిగే వ్యాధుల నుండి నివారణ కొరకు ఫ్రైడే ఫ్రైడే నిర్వాహనతో ప్రజలకు అవగాహన కల్పించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం రాఘవేంద్ర థియేటర్, అయోధ్య నగర్ పరిసర ప్రాంతాలలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలు దోమల బారిన పడకుండా ఉండేందుకు విఎంసి సిబ్బంది అవగాహన కల్పించారు. అందులో భాగంగా అక్కడ నివసిస్తున్న ప్రజల వారి ఇళ్లలో ఉన్న నీటి నిల్వలను శుభ్రం చేస్తూ …

Read More »

నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టారీత్యా చర్యలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ కార్పొరేషన్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని 8వ అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ గోలీ లెనిన్ బాబు అన్నారు. సర్కిల్-3 పరిధిలోని శానిటరీ ఇన్స్పెక్టర్లు నమోదు చేసిన కేసులు పై శుక్రవారం సర్కిల్-3 కార్యాలయం, పటమట లో ఏర్పాటుచేసిన మొబైల్ కోర్టులో విచారణ జరిపారు. న్యాయమూర్తి గోలీ లెనిన్ బాబు మాట్లాడుతూ రోడ్లపై చెత్త వేసినా, మురుగు ప్రవాహానికి అడ్డుపెట్టిన, రోడ్డుపైన పెంపుడు జంతువులు ఉంచిన, లైసెన్స్ లేకుండా వ్యాపారం నిర్వహిస్తున్న వారిపై మొబైల్ కోర్టు …

Read More »

కోర్టు కేసులపై నిరంతర సమీక్ష అవసరం

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారం ఉదయం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని తన ఛాంబర్లో శాఖాధిపతులతో వివిధ కోర్టు కేసులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరపాలక సంస్థకు సంబంధించిన పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసుల స్థితిగతులు, వాటిపై తీసుకోవాల్సిన చర్యలు, కోర్టు ఆదేశాల అమలు తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న ప్రతి కోర్టు కేసును సంబంధిత …

Read More »

ఏపీ జేఏసీ చైర్మైన్ ఎ విద్యా సాగర్ ని మర్యాదపూర్వకంగా కలసిన టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్మెంట్ నాయకులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక గాంధీనగర్ లోని ఏపీ ఎన్జీవో హోం లో శుక్రవారం ఏపీ ఎన్జీజీఓస్ రాష్ట్ర అధ్యక్షులు, ఏపీ జేఏసీ చైర్మైన్ ఎ విద్యా సాగర్ ను నూతనంగా ఎన్నికైన టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్మెంట్ అధ్యక్షులు ఆర్. ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి యండి ఎల్ సిద్దిక్ ఆధ్వర్యంలో కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. డిపార్ట్మెంట్ లో టెక్నికల్ ఆఫీసర్స్ కు సంబంధించిన విషయాలపై, వాళ్ళ సమస్యలపై చర్చించారు. విద్యా సాగర్ మాట్లాడుతూ డిపార్ట్మెంట్లో సమస్యలను …

Read More »

ఎడ్యుకేషనల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు

-విద్యార్థుల భద్రతే ప్రధాన లక్ష్యం – డీటీసీ యం. పురేంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థులను విద్యాసంస్థలకు తీసుకొని వెళ్లే బస్సులపై తనిఖీలు నిర్వహించి భద్రత ప్రమాణాలను పరిశీలిస్తున్నామని డిటిసి ఎం పురేంద్ర తెలిపారు. స్థానిక బందరు రోడ్డు లోని డీటీసీ కార్యాలయం నుండి శుక్రవారంనాడు డీటీసీ యం. పురేంద్ర ఒక ప్రకటనను విడుదల చేశారు. డీటీసీ యం. పురేంద్ర మాట్లాడుతూ విద్యార్థులను స్కూలుకు కాలేజీలకు తీసుకొని వెళ్లే బస్సులలో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ జిల్లాలోని స్కూల్స్, కాలేజ్ బస్సులపై …

Read More »

నూతన జోన్ ఏర్పాటు కు గెజెట్ విడుదల సందర్భంగా సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ ధన్యవాదాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్, విజయవాడ డివిజనల్ సెక్రటరీ లీల, హింద్ మజ్దూర్ సభ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఎన్. శ్రీనివాస రావు ఈరోజు విజయవాడ పార్లమెంట్ సభ్యులు  కేశినేని శివనాధ్ ని కలిసి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి గెజెట్ విడుదల చేసి 01.06 26 నుండి నూతన జోన్ ఏర్పాటు చేసినందుకు రైల్వే కార్మికుల తరపున ధన్యవాదములు తెలియచేసారు. ఈ సందర్భముగా నూతన సౌత్ కోస్ట్ …

Read More »