Breaking News

Tag Archives: vijayawada

పాత్రికేయులకు నిజాయితీయే కవచం

-ప్రముఖ జర్నలిస్టు ఎస్ వెంకట్ నారాయణ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జర్నలిస్టులు నిజాయితీగా ఉంటే ఎవరికి భయపడనవసరం లేదని, సమాజంలో తలెత్తుకు తిరగవచ్చని, అందరూ గౌరవిస్తారని ప్రముఖ జర్నలిస్ట్ వెంకట్ నారాయణ్ (83) అభిప్రాయపడ్డారు.ఆయన ఆదివారం ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు విజయవాడ రాగా ఏపీయూడబ్ల్యూజే నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి ప్రెస్ క్లబ్ కు ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఆయన గత ఆరు దశాబ్దాల కాలంలో జర్నలిజంలో తన అనుభవాలను యూనియన్ నేతలతో పంచుకున్నారు. తాను ఇప్పటివరకు 68 దేశాల్లో పర్యటించానని, …

Read More »

కొత్తపేటలో రెండో రోజు సుజనా ఫౌండేషన్ మొబైల్ మెడికల్ క్యాంప్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కొత్తపేట లో సుజనా ఫౌండేషన్ మొబైల్ మెడికల్ క్యాంపు లో విశేషంగా ప్రజలు పాల్గొన్నారు.. పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని కొత్తపేట కేబిఎన్ కళాశాలలో సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొబైల్ మెడికల్ వ్యాన్ల ద్వారా ఉచిత మెడికల్ క్యాంపు ఆదివారం కూడా కొనసాగింది.., ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన మెడికల్ క్యాంపు లో 52, 53 డివిజన్ల ప్రజలు విస్తృతంగా పాల్గొన్నారు.. క్యాంప్ ద్వారా పలు ఆరోగ్య సమస్యలకు సంబంధించిన వైద్య పరీక్షలు, చికిత్స సహాయం …

Read More »

2వ రోజు కొనసాగిన ఫ్యాప్టో నిరాహార దీక్ష

-ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని ఉదృతం చేస్తాం! విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఫ్యాప్టో మలిదశ పోరుబాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనగా 26వ తేది విజయవాడ ధర్నా చౌక్ నందు జరిగిన నిరాహార దీక్ష విజయవంతమైనదని ఫ్యాప్టో చైర్మన్ ఎల్.సాయి శ్రీనివాస్, సెక్రటరీ జనరల్ ఎస్. చిరంజీవి ఒక ప్రకటన విడుదల చేశారు. దీక్షకు అధ్యక్షత వహించిన ఫ్యాప్టో చైర్మన్ ఎల్.సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ 12వ వేతన సవరణ సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలని, ఏకీకృత …

Read More »

అసాధారణ పట్టుదలతో ఎవరెస్ట్ శిఖరాన్ని ముద్దాడిన ప్రత్యేక ప్రతిభావంతులు

-అంగవైకల్యాన్ని జయించి.. ఎవరెస్ట్ ను అధిరోహించిన తెలుగు తేజాలు -విజయవంతంగా 21 మంది దివ్యాంగ విద్యార్థుల ఎవరెస్ట్ శిఖరారోహణ! -దివ్యాంగుల బృందంతో ట్రెక్కింగ్.. ప్రపంచంలోనే తొలిసారి -వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం -అభినందించిన విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ -హర్షం వ్యక్తం చేసిన విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఉన్నతాధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులు -“సరిగ్గా నడవలేడు, వినపడదు.. ఈ అబ్బాయి కొండలు ఎక్కుతాడా?” లేదా “ఇంత కష్టమైన పని నీకెందుకు, ఇంట్లో కూర్చోవచ్చు కదా” వెటకారపు మాటలు.. – ” దినసరి కూలీల …

Read More »

పెట్రోలు, డీజిల్ కొరత లేకుండా పటిష్ట చర్యలు తీసుకున్నాం

-అపోహలు నమ్మవద్దు – అవసరానికి మించి కొనొద్దు -డిమాండ్ కు తగ్గట్లు సరఫరాకు ప్రభుత్వం చర్యలు -రైతులకు ఇబ్బందులు లేకుండా వ్యవసాయ అవసరాలకు ప్రాధాన్యం – బ్లాక్ మార్కెట్ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు -ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ఇంధనానికి కొరత లేకుండా చర్యలు తీసుకున్నామని.. అపోహలు నమ్మవద్దని, ఆందోళనతో అవసరానికి మించి కొనుగోలు చేయవద్దు అని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సూచించారు. జిల్లాలో రోజువారీ …

Read More »

“ఆరోగ్యకరమైన ఆహారం – ఆరోగ్యకరమైన జీవితం”

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ సహకారంతో హ్యాపీ సండే లో భాగంగా వన్ ఎర్త్ వన్ లైఫ్ (టెర్రస్ గార్డెన్ గ్రూప్) ఆధ్వర్యంలో ఆదివారం ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద నిర్వహించిన “Organic Vegetables – Farmer to Consumer” కార్యక్రమం విజయవంతంగా జరిగింది. “ఆరోగ్యకరమైన ఆహారం – ఆరోగ్యకరమైన జీవితం” అనే నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రసాయన రహిత, సేంద్రియంగా పండించిన కూరగాయలు మరియు ఆకుకూరలను నేరుగా రైతుల నుండి వినియోగదారులకు అందుబాటు ధరల్లో …

Read More »

ఈ నెల 27న పీజీఆర్ఎస్ ద్వారా అర్జీల స్వీక‌ర‌ణ‌

– జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 27వ తేదీ సోమవారం కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం … పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం) కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీక‌రించనున్న‌ట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి పీజీఆర్ఎస్ ద్వారా అర్జీల స్వీకరణ చేపడుతునున్నట్టు తెలిపారు. కలెక్టరేట్, డివిజన్, మునిసిపల్, మండల కేంద్రాల్లో సంబంధిత అధికారులు ప్రజలకు …

Read More »

స్వీయ గ‌ణ‌న‌తో క‌చ్చిత‌మైన స‌మాచారం

– ప్ర‌క్రియ‌లో పార‌ద‌ర్శ‌క‌త‌, స‌మ‌యం ఆదాకు వీలు – స్వీయ గ‌ణ‌నలో ప్ర‌తిఒక్క‌రూ భాగ‌స్వాములుకండి – జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జ‌న గ‌ణ‌న‌కు సంబంధించి స్వీయ గ‌ణ‌న (సెల్ఫ్ ఎన్యూమ‌రేష‌న్‌)తో క‌చ్చిత‌మైన డేటాతో పాటు అత్యంత పార‌ద‌ర్శ‌క‌త‌కు, స‌మ‌యం ఆదాకు వీలుంటుంద‌ని, ప్ర‌తిఒక్క‌రూ స్వీయ గ‌ణ‌న ప్ర‌క్రియ‌లో భాగ‌స్వాములు కావాల‌ని జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా అధికార యంత్రాంగం, విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ సంయుక్త ఆధ్వ‌ర్యంలో ఇందిరాగాంధీ మునిసిప‌ల్ మైదానం వ‌ద్ద …

Read More »

డీజిల్, పెట్రోల్ కొరతతో రైతులు, ప్రజలు విలవిల

-బంకుల దగ్గర బారులు తీరున్న వినియోగదారులు -నిత్యవసర ధరలు పెరిగే ప్రమాదం -ప్రణాళిక లోపం, ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం -సీఎం చంద్రబాబు సమీక్షలకే పరిమితం కాకుండా తక్షణ చర్యలు చేపట్టాలి -సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీలో డీజిల్, పెట్రోల్ కొరతతో రైతులు, వాహనదారులు, ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని, యుద్ధప్రాతిపదికన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఈ సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. …

Read More »

Justice Lisa Gill sworn-in as Chief Justice of High Court of Andhra Pradesh

Vijayawada, Neti Patrika Prajavartha : Governor of Andhra Pradesh S. Abdul Nazeer administered oath of office to Chief Justice-designate Justice Lisa Gill as Chief Justice of the High Court of Andhra Pradesh at a programme held in Lok Bhavan lawns here on Saturday. The programme began with G. Sai Prasad, Chief Secretary to Government commencing the proceedings, followed by the …

Read More »