రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
శనివారం తూర్పు గోదావరి జిల్లా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గంధం సునీత ఆదేశానుసారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ ఎన్. శ్రీ లక్ష్మి స్థానిక గౌతమి జీవ కారుణ్య సంఘం వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా అక్కడ వున్న వసతులను, వారికి అందిస్తున్న ఆహారాన్ని, సదుపాయాలను పరిశీలించిన తరువాత వయోవృద్దులతో మాట్లాడి వారి యోగా క్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. వారికి అందుతున్న సదుపాయాలలో ఏదైనా అసంతృప్తి ఉంటే తెలియజేయాలని అన్నారు. వేళకు భోజనం చేస్తూ మందులు వేసుకోవాలని వృద్ధులకు సూచించారు.
Prajavartha Online Telugu News