Breaking News

అఖిల భారత మాల సంఘాల జే. ఏ. సీ కార్య నిర్వాహక సమావేశం

విజయవాడ,  నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ గాంధీనగర్ లో ఒక హోటల్ జరిగినది, ఈ కార్యక్రమంలో అఖిల భారత మాల సంఘాల జే. ఏ. సీ కార్యవర్గ ఎన్నిక మరియు నియామక పత్రాలు జారీ చేయడం జరిగినది, అఖిల భారత మాల సంఘాల జే. ఏ. సీ చైర్మన్ డాక్టర్ ఉప్పులేటి దేవి ప్రసాద్ (ఐ.ఆర్.ఎస్ రిటైర్డ్ ) అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎస్. సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం అని , దళితుల హక్కుల అణచివేతను ఎదుర్కునేందుకు కార్యాచరణ రూపొందించడం జరిగిందని, మాలల హక్కులను కాపాడుకోనేందుకు అఖిల భారత మాల సంఘాల జే. ఏ.సీ కృషి చేస్తుంది అని తెలిపారు SC వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం అని, న్యాయ విరుద్ధం అని, సామాజిక విరుద్ధం అని ఇప్పటికే న్యాయ పోరాటం మొదలు పెట్టామని, డిసెంబర్ 15 న గుంటూరు జిల్లా నల్లపాడు లో మాలల మహా గర్జన కార్యక్రమానికి లక్షలాది మాలలు హాజరై SC వర్గీకరణ ను వ్యతిరేకించినా, రాష్ట్ర ప్రభుత్వం SC వర్గీకరణ ప్రయత్నాన్ని మానుకోవాలి, లేనిచో మాలలు క్షేత్ర స్థాయిలో ఉధ్యమించుడానికి అఖిల భారత మాల సంఘాల జే. ఏ. సీ ఉద్యమిస్తుంది అని తెలిపారు. ఈ కార్యక్రమం లో జే. ఏ. సి వైస్ చైర్మన్ గుర్రం రామారావు, మహిళా అధ్యక్షురాలు నాగ మల్లేశ్వరి ఇలా, రాష్ట్ర నాయకులు, జిల్లాల నుండి నాయకులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *