Breaking News

రూ.5కే నాణ్యమైన ఆహారం లభిస్తుండడం పట్ల ప్రజలు హర్షం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
అన్నక్యాంటీన్లలో రూ.5కే నాణ్యమైన ఆహారం లభిస్తుండడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ అన్నారు. మంగళవారం అమరావతి రోడ్ లోని అన్న క్యాంటీన్ ని పరిశీలించి, ప్రజలతో మాట్లాడి, సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అన్న క్యాంటీన్లకు వచ్చే పేద ప్రజలకు రూ.5కే నాణ్యమైన ఆహారం లభిస్తుందని, ఆహారం తీసుకుంటున్న ప్రజలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారన్నారు. ప్రస్తుతం టిఫిన్ చేయాలన్నా రూ.50 అవుతున్న పరిస్థితుల్లో పూటకు రూ.5కే కడుపు నిండుతుందన్నారు. ప్రజల డిమాండ్ కి తగిన విధంగా ఇండెండ్ పెంచాలని అక్షయ పాత్ర సిబ్బందికి, క్యాంటీన్ల పరిసరాల్లో పరిశుభ్రత, ఆహ్లాద వాతావరనం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *