Breaking News

Daily Archives: April 2, 2025

ర‌క్ష‌ణ రంగంలో పెండింగ్ ప్రాజెక్టులు త్వ‌ర‌గా పూర్తి చేయండి.. రాష్ట్ర మంత్రి టి.జి భ‌ర‌త్

-ఢిల్లీలో ర‌క్ష‌ణ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌ను క‌లిసిన టి.జి భ‌ర‌త్ -ప్రాజెక్టుల పురోగ‌తిపై చ‌ర్చించిన మంత్రి ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర‌ప్రదేశ్‌లో ర‌క్ష‌ణ రంగానికి సంబంధించిన ప్రాజెక్టుల ప‌నులు చురుగ్గా కొన‌సాగించాల‌ని ర‌క్ష‌ణ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌ను.. రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్ కోరారు. ఢిల్లీలో కేంద్ర‌మంత్రిని క‌లిసి ఏపీకి సంబంధించిన ప్రాజెక్టుల‌పై ఆయ‌న చ‌ర్చించారు. పెండింగ్ ప్రాజెక్టులు వేగ‌వంతం చేయాల‌ని కోరిన‌ట్లు మంత్రి తెలిపారు. ర‌క్ష‌ణ రంగానికి సంబంధించిన ప్రాజెక్టుల …

Read More »

విశాఖలో ప్రేమోన్మాది ఘాతుకంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

-బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నంలో యువతిపై ప్రేమోన్మాది దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోవడం, మరొకరు ప్రాణాపాయ స్థితిలో ఉండటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దాడిని అడ్డుకునే ప్రయత్నంలో నిందితుడి చేతిలో యువతి తల్లి నక్కా లక్ష్మి ప్రాణాలు కోల్పోవడం విచారకరం అన్నారు. ఈ ఘటనపై సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న యువతి ఆరోగ్య పరిస్థితిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బాధిత యువతికి …

Read More »

ఐదుగురు ఎంఎల్సిల ప్రమాణ స్వీకారం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలికి ఎంపికైన ఐదుగురు శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు,బిటి నాయుడు,కొణిదల నాగేంద్ర రావు(నాగబాబు) పేరాబత్తుల రాజశేఖర్,ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ లచే బుధవారం రాష్ట్ర అసెంబ్లీ భవనంలోని చైర్మన్ చాంబరులో రాష్ట్ర శాసన మండలి అధ్యక్షులు కొయ్యే మోషేన్ రాజు సభ్యులచే శాసన మండలి సభ్యులుగా ప్రమాణం చేయించారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖామాత్యులు కె.అచ్చన్నాయుడు,అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్నకుమార్,ఉప కార్యదర్శి రాజ్ కుమార్,ఇతర అధికారులు, పలువురు ఎంఎల్ఏలు,ఎంఎల్సిలు,ఇతర ప్రజా …

Read More »

వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఆర్థిక వ్యవస్థ నాశనం.. మంత్రి నారాయణ

-అప్పులు తీర్చడానికే కష్టంగా మారిన బడ్జెట్… -విజయవాడలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీని మెరుగుపరుస్తాం.. -పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి కోసం పూర్తి సహాయ, సహకారాలు అందిస్తా. సుజనా మిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి నారాయణ  విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలోని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరితో కలిసి ఆయన భవానిపురంలో సుజన మిత్ర కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. సుజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో డివిజన్ కోఆర్డినేటర్లను ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకునే …

Read More »

గ‌త మూడేళ్లుగా క‌మ్యూనిటీ రేడియో స్టేష‌న్స్ కి విడుద‌ల చేసిన నిధులు రూ.5.43 కోట్లు

-కేంద్ర స‌మాచార ప్ర‌సార శాఖ స‌హాయ మంత్రి డాక్ట‌ర్ ఎల్.మురుగ‌న్ వెల్ల‌డి -క‌మ్యూనిటీ రేడియో స్టేష‌న్స్ పై కేంద్ర స‌మాచార ప్ర‌సార శాఖను ప్ర‌శ్నించిన ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : దేశ వ్యాప్తంగా కమ్యూనిటీ రేడియోలను ప్రోత్సహించడానికి కేంద్ర‌ ప్రభుత్వం క్రమం తప్పకుండా వర్క్‌షాప్‌లను నిర్వహిస్తుందని, 2025లో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 5వర్క్‌షాప్‌లను నిర్వహించారు. గత మూడు సంవత్సరాలుగా సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఆఫ్ సపోర్టింగ్ కమ్యూనిటీ రేడియో మూవ్‌మెంట్ కింద 2021-22 లో రూ.1.30 కోట్లు, 2022-23 …

Read More »

ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ (ABP) కింద కొత్త బ్లాక్స్ కి ప్ర‌ణాళిక లేదు

-కేంద్ర ప్రణాళికా శాఖ స‌హాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) రావు ఇంద్రజిత్ సింగ్ వెల్ల‌డి -ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ (ABP) పై ప్ర‌శ్నించిన ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని), ఎంపి ద‌గ్గుమ‌ళ్ల ప్ర‌సాద్ రావు, ఎంపి. జి.ల‌క్షీనారాయ‌ణ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుతం దేశవ్యాప్తంగా 500 ఆస్పిరేషనల్ బ్లాక్స్ ఉన్నాయి. ఇవి పెంచే ప్రతిపాదన ప్రస్తుతం లేదు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని అనంతపురం జిల్లాను ప్రస్తుత ప్రణాళికలో చేర్చటం లేదన్నారు. కేంద్ర ప్ర‌భుత్వం 500 బ్లాక్స్ కే నిధులు కేటాయించింద‌ని, కొత్త బ్లాక్స్ …

Read More »

తల్లిదండ్రుల్లో నెలకొన్న అపోహలను అవగాహన ద్వారా తొలగించి, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మోడల్ ప్రాథమిక పాఠశాలల ఏర్పాటుపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో నెలకొన్న అపోహలను అవగాహన ద్వారా తొలగించి, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం పెడన నియోజకవర్గం లోని కృత్తివెన్ను మండలంలోని చిన్న పాండ్రాక, కెవిఆర్ నగర్, బంటుమిల్లి మండలంలోని తుమ్మిడి, ఆర్జావాని గూడెం, కామాక్షి పురం గ్రామాల్లో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలను జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఒకే పాఠశాలలో …

Read More »

బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయం…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయంగా పాఠశాలల పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని అందుకు విద్యార్థుల తల్లిదండ్రులు సంపూర్ణ సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కలెక్టర్ జిల్లాలోని పామర్రు, పెదపారుపూడి, గుడివాడ, గుడ్లవల్లేరు, కృత్తివెన్ను,బంటుమిల్లి మండలాలలో సుడిగాలి పర్యటన చేసి మండల పరిషత్ పాఠశాలల పరిధిలో విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి ప్రభుత్వ ప్రధాన ఉద్దేశాన్ని వివరించారు. తొలుత జిల్లా కలెక్టర్ పామర్రు …

Read More »

4వ తేదిలోపు లక్షమందితో స్వచ్ఛ సర్వేక్షణ్ ఫీడ్ బ్యాక్ పూర్తి చేయాలి

-కేతన్ గార్గ్, ఐ.ఎ.ఎస్., కమిషనరు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్ఛ్ భారత్ మిషన్ నిర్వహిస్తున్న స్వచ్ఛ్ సర్వేక్షణ 2024 పోటీలలో ముఖ్య కార్యక్రమమైన సిటిజన్ ఫీడ్‌బ్యాక్ (ప్రజా అభిప్రాయ సేకరణ) 4వ తేదిలోపు లక్ష మందితో ఫీడ్ బ్యాక్ పూర్తి చేయాలని ఈ నేపథ్యంలో, ప్రతి వార్డు సచివాలయ కార్యదర్శి సిటిజన్ ఫీడ్‌బ్యాక్‌ను ప్రజల ద్వారా తప్పనిసరిగా సేకరించాలని, తద్వారా స్వచ్ఛ్ సర్వేక్షణ 2024 పోటీలో ఉత్తమ స్థానం సాధించే అవకాశం ఉందని రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ కమిషనర్ కేతన్ …

Read More »

విజయవాడ రైతు బజార్ ను తనిఖీ చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వినియోగాలకు నాణ్యమైన సరుకులు సరసమైన ధరలకు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రైతు బజార్ నిర్వహిస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తనిఖీలలో భాగంగా ఈరోజు ఆటోనగర్ APICC లో ఉన్న రైతు బజార్ ను మంత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. అధికారులతో కలిసి ప్రతి షాప్ ను షాపులో ఉన్న సరుకులను పరిశీలించారు. వినియోగదారులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతు బజార్లో ఉన్న బియ్యం షాప్ లో బియ్యం పరిశీలించి, 26 కేజీల గల …

Read More »