Breaking News

Daily Archives: April 18, 2025

దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది

-టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా పేర్కొన్నారు. వీర వసంత దివ్యాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మల్లెల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సంఘం 38 వ వార్షికోత్సవ వేడుకలు భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా …

Read More »

ఏసు క్రీస్తు మ‌హా త్యాగానికి గుర్తు గుడ్ ఫ్రైడే : ఎంపి కేశినేని శివ‌నాథ్

-మూల‌పాడు ఆర్.సి.ఎం చ‌ర్చ్ లో ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు -శిలువ మార్గం కార్య‌క్ర‌మంలో శిలువ మోసిన ఎంపి కేశినేని ఇబ్ర‌హీంప‌ట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌పంచ మాన‌వాళి పాప విముక్తి కోసం ఏసు క్రీస్తు చేసిన అంతిమ త్యాగానికి ప్ర‌తీకగా గుడ్ ఫ్రైడే జ‌రుపుకుంటామ‌ని ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) అన్నారు. గుడ్ ఫ్రైడ్ సంద‌ర్భంగా ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) శుక్ర‌వారం ఇబ్ర‌హీంప‌ట్నం మండ‌లంలోని మూల‌పాడు గ్రామంలోని ఆర్.సి.ఎం చ‌ర్చ్ లో ప్ర‌త్యేక‌ ప్రార్థ‌నలు నిర్వ‌హించారు. అనంత‌రం శిలువ మార్గం కార్య‌క్ర‌మంలో ఎంపి కేశినేని …

Read More »

దేశానికే క్రీడా రాజ‌ధానిగా అమ‌రావ‌తి అభివృద్ది చెందుతుంది : ఎంపి కేశినేని శివ‌నాథ్

-మూల‌పాడు క్రికెట్ స్టేడియంలో మీడియా ప్ర‌తినిధుల‌కు క్రికెట్ టోర్న‌మెంట్ -అమ‌రావ‌తి ప్రీమియ‌ర్ లీగ్ క్రికెట్ పోటీలు ప్రారంభం -టాస్ వేసి మ్యాచ్ ప్రారంభించిన ఎంపి కేశినేని, శాప్ చైర్మ‌న్ ర‌వినాయుడు -త్వ‌ర‌లో రాష్ట్రానికి ఐపీఎల్ టీమ్ ఏర్పాటు చేసేందుకు కృషి -రాబోయే క్రిస్మ‌స్ సంక్రాంతి సెల‌వుల్లో గ్రామాల్లో క్రీడా పోటీలు -ఏసీఏ త‌రుఫున ప్ర‌ణాళిక బ‌ద్దంగా 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో గ్రౌండ్స్ ఏర్పాటు ఇబ్ర‌హీంప‌ట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాబోయే కాలంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు నాయ‌క‌త్వంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ క్రీడాంధ్ర‌ప్రదేశ్ కావ‌టంతో పాటు రాజ‌ధాని …

Read More »

చేనేత, హస్తకళల అభివృద్ధికి సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన సుచిత్ర ఎల్ల

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : పద్మభూషణ్ అవార్డు గ్రహీత, భారత్ బయోటెక్ సహ వ్యవస్థాపకురాలు సుచిత్ర ఎల్ల చేనేత, హస్తకళల అభివృద్ధికి సలహాదారుగా శుక్రవారం విజయవాడలోని ఆప్కో భవన్‌లో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సుచిత్రా ను రెండు సంవత్సరాల కాలపరిమితితో క్యాబినెట్ హోదా లో నియమించింది. ఈ పదవిలో ఆమె రాష్ట్రంలోని చేనేత, హస్తకళా రంగాల బలోపేతానికి వ్యూహాత్మక మార్గదర్శకత్వం అందించనున్నారు. పాలసీ మార్పులపై సలహా, సుస్థిర అభివృద్ధి, మార్కెట్‌ ప్రాప్యత పెంపు, డిజిటల్ వేదికలు, జియోగ్రాఫికల్ ఇండికేషన్ …

Read More »

ఏఎస్‌ఆర్ జిల్లాలో 362 కిలోల గంజాయి పట్టివేత : ఒకరు అరెస్టు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : మత్తుపదార్థాల అక్రమ రవాణాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. నిరంతర పర్యవేక్షణ చర్యల్లో భాగంగా, ఎక్సైజ్ విభాగం స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టీఎఫ్) టీమ్-2 బృందం పెద్దవైలు మండలం, గుతులపుట్టు గ్రామంలో చేపట్టిన దాడిలో 362 కిలోల పొడి గంజాయిను పట్టుకుంది. విశ్వసనీయ సమాచారంతో, ఎస్‌టీఎఫ్ 2 కు నేతృత్వం వహిస్తున్న టి. మధుబాబు ఆధ్వర్యంలో అమరావతి నుంచి ఈ మారుమూల ప్రాంతం చేరుకుని తనిఖీలు నిర్వహించారు. తనిఖీలలో భాగంగా ఏపీ 39 ఎంవై 2005 నంబరు గల …

Read More »

శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠాన్ని సందర్శించిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్

తిరుమల,  నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ కేసలి అప్పారావు మరియు కమిషన్ సభ్యులు గొండు సీతారాం, ఆదిలక్మి త్రిపర్ణ, బత్తుల పద్మావతిలు, జంగం రాజేంద్ర ప్రసాద్ శుక్రవారం తిరుమల ధర్మగిరిలోగల శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంను సందర్శించారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్ పర్సన్, సభ్యులు విద్యార్థులు, ప్రిన్సిపాల్,ఉపాధ్యాయులతో భేటీ అయ్యారు,ఈ సందర్భంగా వీరు పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల సంఖ్యపై ఆరా తీసి, ఒత్తిడికి గురి చేయొద్దని తెలిపారు. వేదాధ్యయన, …

Read More »

16వ ఆర్థిక సంఘం ఛైర్మ‌న్ డా. అర‌వింద్ ప‌న‌గారియా మరియు స‌భ్యులకు సాదర వీడ్కోలు

రేణిగుంట,  నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా రెండు రోజుల పర్యటన అనంతరo శుక్రవారం ఉదయం ఢిల్లీ కి తిరుగు పయనమైన 16వ ఆర్థిక సంఘం చైర్మన్ డా. అరవింద్ పనగారియా మరియు సభ్యులు అన్నే జార్జ్ మ్యాథ్యూ, డా. మనోజ్ పాండా, రిత్విక్ పాండే, కేకే మిశ్రా, అమృత, ఆదిత్య పంత్ తదితర సభ్యులతో కూడిన బృందానికి రేణిగుంట విమానాశ్రయం నందు సాదర వీడ్కోలు లభించింది. ఆం.ప్ర రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ప్రిన్సిపాల్ సెక్రటరీ ఫైనాన్స్ పీయూష్ …

Read More »

విపత్తు సమయాల్లో ఫైర్ సిబ్బంది సేవలు అమోఘం

-ట్రెండ్ సెట్ మాల్ లో ఫైర్ సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహణ -ఫైర్ విభాగంలో అవసరమైన కొత్త వాహనాలు కొనుగోలు చేశాం -కొత్త టెక్నాలజీ ద్వారా ఫైర్ ప్రమాదాలు నివారణకు చర్యలు -వంగలపూడి అనిత, హోమ్ శాఖ మంత్రి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో ట్రెండ్ సెట్ మాల్ లో శుక్రవారం మాకు డ్రిల్ నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర హోమ్ శాఖ …

Read More »

ఏపీ జూనియర్ వెటర్నరీ సహాయకుల సంఘం ఎన్నికల వాయిదా

-ఎన్నికల అధికారి కె. జగదీశ్వరరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 20వ తేదీన లబ్బీపేట లోని వెటర్నరీ హోమ్ లో నిర్వహించాల్సిన ఎపిఎల్ఎస్ఎ, ఎపిజెఓయస్ఎ, ఏపీవిఓఎస్ఎ ఎన్నికలు తాత్కాలికంగా వాయిదా పడినట్లు ఎన్నికల అధికారి కె. జగదీశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఓటరు జాబితా యొక్క ధ్రువీకరణ ప్రతులు, మినిట్స్ పుస్తకం, ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఇతర పత్రాలను సంఘ నిర్వాహకులు నిర్ణీత వ్యవధిలో ఎన్నికల సంఘానికి సమర్పించనందున ఎన్నికలు వాయిదా వేయడానికి కారణమన్నారు. సంఘ నిర్వాహకులు ఎన్నికల సంఘం కోరిన …

Read More »

ప్రధాని నరేంద్ర మోడి శంఖుస్థాపన ఏర్పాట్లను పరిశీలన

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : తుళ్లూరు మండలం వెలగపూడి సచివాలయం సమీపం అమరావతి పరిధిలో వివిధ శంఖుస్థాపన కార్యక్రమాల్లో మే 2 వ తేదిన భారత దేశ ప్రధాని నరేంద్ర మోడి పాల్గొంటున్న నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లను శుక్రవారం జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, ఎక్సైజ్ కమీషనర్ నీషాంత్ కుమార్, సంయుక్త కలెక్టర్ ఏ భార్గవ్ తేజ, ఎం‌టి‌ఎం‌సి కమీషనర్ అలీమ్ భాష, ఆర్‌డి‌ఓ కె.శ్రీనివాస రావు పరిశీలించారు. హెలిప్యాడ్ ఏర్పాట్లు, సభా ప్రాంగణం వద్ద చేపట్టవలసిన ఏర్పాట్లు , వీవీఐపీ లు …

Read More »