తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ రోజు తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయము నందు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్ ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర స్వచ్చాంద్ర లో భాగంగా సిబ్బంది స్వచ్చాంధ్ర ప్రతిజ్ఞ చేసారు. తదుపరి కార్యాలయము ఆవరణలో పరిసరాలను శుభ్రపరిచారు. తడి చెత్త పొడి చెత్త వేరు చేయడం పై అలాగే డ్రైనేజ్ లో చెత్త వేయడం వలన దోమల ఉత్పత్తికి ఆవాసాలు గా మారు తాయని తదితర ఆరోగ్య విషయాల పై అవగాహన కల్పించారు. అనంతరం స్విమ్స్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమం లో డిప్యూటి డిఎమ్ హెచ్ ఓ డాక్టర్ మురళి కృష్ణ, డిపిఎమ్ఓ డాక్టర్ శ్రీనివాసరావ్, మలేరియా అధికారి డాక్టర్ రూప్ కుమార్, AO శ్రీమతి వరలక్ష్మి, స్కూల్ హెల్త్ ఎమ్ ఓ డాక్టర్ పద్మావతి, ఎన్పిసిబి ఎమ్ ఓ,డాక్టర్ మధు బాబు, కిరణ్ కుమార్ డిప్యూటి డెమో ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News