విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల సుజనా చౌదరి లండన్ లో జరిగిన ఓ ప్రమాదంలో గాయపడగా శస్త్ర చికిత్స అనంతరం హైదరాబాద్ లోనీ తమ నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుజనా చౌదరి ఇంటికి వెళ్లి ఆయన ఆరోగ్యం గురించి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. నిరంతరం ప్రజాక్షేమాన్ని కాంక్షించే సుజనా చౌదరి అతి త్వరగా కోలుకొని తిరిగి ప్రజా సేవకు పునరంకితం కావాలని ఆయన ఆకాంక్షించారు.
Prajavartha Online Telugu News