అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSDC) చైర్మన్ అనిమిని రవి నాయుడు ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిసి, ఈ నెల 29వ తేదీన విజయవాడలో నిర్వహించనున్న డిసైబుల్ క్రికెట్ పోటీలకు ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆంధ్రా డిసైబుల్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు, ఇండియన్ నేషనల్ డిసైబుల్ క్రికెట్ జట్టు కెప్టెన్ వసంత్ కుమార్, వైస్ కెప్టెన్ రామిరెడ్డి కూడా పాల్గొని, పోటీల విశేషాలను వివరించి ఆహ్వాన పత్రికను అందజేశారు.
Prajavartha Online Telugu News