Breaking News

డివిజన్ స్థాయిలో ప్రజలు ఎదుర్కోను ఇబ్బందులను పరిష్కరించాలి…

-పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని సమస్యలపై సమీక్ష అధికారులకు పలు సూచనలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు 39,40,42 మరియు 43 డివిజన్లకు సంబంధించిన సమస్యల పై పశ్చిమ శాసన సభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్., డివిజన్ కార్పొరేటర్లతో కలిసి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్బంలో గడపగడపకు మన ప్రభుత్వం ద్వారా క్షేత్ర స్థాయిలో డివిజన్ నందు పర్యటించిన సందర్బంలో ప్రధానంగా రోడ్లు, డ్రెయిన్లు, త్రాగు నీటి సరఫరా, కొండ ప్రాంతాలలో మెట్ల మార్గం వంటి పలు ప్రధాన సమస్యలను ప్రజలు తమ దృష్టికి తీసుకురావటం జరిగిందని వివరిస్తూ, నగరపాలక సంస్థ ద్వారా ప్రజలకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలలో ఎదురౌతున్న ఇబ్బందులకు సత్వరమే పరిష్కరించునట్లుగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సమావేశంలో కార్పొరేటర్లు గుడివాడ నరేంద్ర రాఘవ, యారడ్ల ఆంజనేయ రెడ్డి, పడిగపాటి చైతన్య రెడ్డి, బాపతి కోటిరెడ్డి, బుల్లా విజయ కుమార్ మరియు చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, అదనపు కమిషనర్ (జనరల్) యం. శ్యామల, మరియు ఇతర విభాగముల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *