Breaking News

సోమవారం విజయవాడ నగరపాలక సంస్థలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

-కార్పొరేషన్ తో పాటు జోనల్ కార్యాలయంలో కూడా ఫిర్యాదుల సేకరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగర పాలక సంస్థ ఇంచార్జి కమిషనర్ డాక్టర్ ఏ మహేష్ ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహిస్తున్నారని, కేవలం ప్రధాన కార్యాలయంలోనే కాకుండా ప్రతి సర్కిల్లో జోనల్ కార్యాలయాల్లో కూడా ప్రజలు తమ ఫిర్యాదులను దరఖాస్తు చేసుకునేందుకు జోనల్ కార్యాలయంలో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల తమకు ఎటువంటి సమస్య ఉన్న సోమవారం జరిగే కార్పొరేషన్ లో కానీ జోనల్ కార్యాలయాల్లో కానీ తమ ఫిర్యాదులను ఉదయం 10:00 నుండి దరఖాస్తు చేసుకోవచ్చని, వాళ్ల ప్రతి సమస్యకు ఖచ్చితమైందా పరిష్కారం అందించే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటారని విజయవాడ నగర పాలక సంస్థ ఇంచార్జి కమిషనర్ అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *