Breaking News

Tag Archives: jaggaiahpeta

ఎమ్.ఎస్.ఎమ్.ఈ రుణాల‌పై అవగాహ‌న స‌ద‌స్సు ప్ర‌జ‌లు ఉప‌యోగించుకోవాలి

-ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య , ఎన్టీఆర్ జిల్లా ఎమ్.ఎస్.ఎమ్.ఈ కో-ఆర్డినేటర్ మాదిగాని గురునాథం జ‌గ్గ‌య్య‌పేట, నేటి పత్రిక ప్రజావార్త : స్వయం ఉపాధి రంగంలో మహిళలతో పాటు,యువతీ యువకులు ముందడుగు వేసి ఎంటర్ ప్రెన్యూర్స్ రాణించేందుకు జ‌గ్గ‌య్య‌పేట ప‌ట్ట‌ణంలో ఎమ్.ఎస్.ఎమ్.ఈ (మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజస్ ) రుణాలపై ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) అవ‌గాహ‌న స‌ద‌స్సులు ఏర్పాటుచేయిస్తున్నారు. ఆ స‌ద‌స్సులు ప్ర‌జ‌లు ఉప‌యోగించుకోవాల‌ని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య కోరారు. ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య,ఎన్టీఆర్ జిల్లా ఎమ్.ఎస్.ఎమ్.ఈ …

Read More »

గ్రామాలు అభివృద్ధి చెందాలంటే మహిళలు ముందు అడుగు వేయాలి

-అనుమంచిపల్లి గ్రామ డ్వాక్రా మహిళలతో ఎన్టీఆర్ జిల్లా ఎన్.ఐ. ఆర్. డి. పి. ఆర్ ప్రతినిధుల సమావేశం జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) ఆదేశాల మేర‌కు డ్వాక్రా మహిళలకు స్వయం ఉపాధి రంగంలో కుటీర పరిశ్రమల ఏర్పాటుపై అవగాహన కల్పించేందుకు ఎన్టీఆర్ జిల్లా nirdpr కోఆర్డినేటర్ జి. వి నరసింహారావు ఆధ్వర్యంలో జగ్గయ్యపేట మండలంలోని అనుమంచిపల్లి గ్రామంలో గురువారం సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఎన్. ఐ. ఆర్. డి ప్రతినిధి మురళి, ఎన్టీఆర్ జిల్లా …

Read More »

స‌మ‌గ్ర గ్రామాభివృద్ధికి పంచాయతీ ఛాంపియన్స్ కృషి చేయాలి : ఎమ్మెల్యే శ్రీరాం రాజ‌గోపాల్

-ఎమ్మెల్యే ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసిన ” పంచాయతీ ఛాంపియన్స్” జ‌గ్గ‌య్య‌పేట‌, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) గారు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన “వికసిత్ పంచాయత్” భాగంగా ఎన్టీఆర్ జిల్లా జ‌గ్గ‌య్య‌పేట రూర‌ల్ మండ‌లం నుంచి పంచాయతీ ఛాంపియన్స్ గా శిక్షణ పొందిన 8 మంది బుధ‌వారం జ‌గ్గ‌య్య‌పేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)ను ఆయ‌న నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. హైద‌రాబాద్ ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్. లో గ్రామ పంచాయతీలను స‌మ‌గ్రంగా ఏ విధంగా అభివృద్ది చేయాల‌నే అంశం పై ఫిబ్రవరి 10 …

Read More »

రవాణావాహనాలు నడిపేటప్పుడు డ్రైవర్లు నిబంధనలు తప్పక పాటించాలి

-మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ యం వి నారాయణ రాజు జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : సరుకు రవాణా చేసే వాహన డ్రైవర్లు భద్రత నియమాలు తప్పక పాటించాలని, ఇష్టారాజ్యంగా వాహనాలు నడిపి ఇతరుల ప్రాణాలు తీయొద్దని మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ యం వి నారాయణ రాజు అన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా కెసిపి సిమెంట్ ప్రాంగణంలో గురువారం నాడు కెసిపి సిమెంట్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు మరియు ఉద్యోగులు తో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కెసిపి ప్రాంగణంలో జరిగిన …

Read More »

త‌క్కువ వ్య‌యంతో అధిక దిగుబడులు సాధించాలి..

– రైతులు పొలం పిలుస్తోంది కార్య‌క్ర‌మాన్ని స‌ద్వినియోగం చేసుకోవాలి – వ్య‌వ‌సాయ శాస్త్ర‌వేత్త‌లు, అధికారుల సూచ‌న‌లు పాటించాలి – ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ జ‌గ్గ‌య్య‌పేట‌, నేటి పత్రిక ప్రజావార్త : పంట‌ల సాగు వ్య‌యాన్ని త‌గ్గించి, అధిక దిగుబ‌డుల‌తో పాటు మెరుగైన ఆదాయాలు పొందాల‌నే ల‌క్ష్యంతో పొలం పిలుస్తోంది కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌డం జ‌రుగుతోంద‌ని, ఈ కార్య‌క్ర‌మాన్ని రైతులు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. బుధ‌వారం క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌.. జ‌గ్గ‌య్య‌పేట మండ‌లంలో ప‌ర్య‌టించి, క్షేత్ర‌స్థాయిలో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను ప‌రిశీలించారు. …

Read More »

హెల్మెట్ ధరించాలి – బైక్ నడపాలి

-హెల్మెట్ ధరించకుండా బైకులు నడిపితే కేసులు నమోదు చేస్తాం-.మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ యంవియన్ రాజు జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : 36 వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు సందర్భంగా జగ్గయ్యపేట పట్టణంలో హెల్మెంట్ ధరించి ద్విచక్ర వాహనాలతో మోటర్ వెహికల్ కార్యాలయం నుండి పట్టణ ప్రధాన కూడళ్లలో బైక్ ర్యాలీ ని మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ యంవియన్ రాజు,ట్రాఫిక్ ఎస్ఐ ఆర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ యంవియన్ రాజు మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలను నడిపే వాహన …

Read More »

జగ్గయ్యపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నూతన పార్టీ ఆఫీసు

జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఆదివారం నూతన పార్టీ ఆఫీసు ను ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ జగ్గయ్యపేట నియోజకవర్గంలో మరలా తిరిగి వైఎస్ఆర్సీపీ పార్టీ బలోపేతానికి నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని అవినాష్ అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటి కప్పుడు ప్రజలోకి తీసుకువెళ్లాలని అవినాష్ తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజలను అన్ని విధాలా మోసం చేసింది అని ఇచ్చిన హామీలను నెరవేర్చలేక …

Read More »

శ్రీను కుటుంబానికి వైసీపీ పార్టీ అండగా ఉంటుంది… : దేవినేని అవినాష్

జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : జగ్గయ్యపేట నాగమయ్య బజారులో అధికార పార్టీ ఆగడాలకు బలైన వైసీపీ సానుభూతిపరుడు గుగ్గిళ్ళ శ్రీను కుటుంబాన్ని వైసిపి జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ పరామర్శించి రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేసారు. ఈ  సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకుల దౌర్జన్యాలకు బలైన గుగ్గిళ్ళ శ్రీను కుటుంబానికి వైసీపీ పార్టీ అండగా ఉంటుందన్నారు. శ్రీను మరణాన్ని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి వారి కుటుంబానికి …

Read More »

ఏపీ ఎన్జీఓస్ జగ్గయ్యపేట నూతన అధ్యక్ష కార్యదర్శిగా వెంకట్రావు, బాబూరావు

-ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి- ఎన్జీవో నేత ఎ విద్యాసాగర్ జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పెన్షనర్లకు సంబంధించిన అనేక సమస్యలు పెండింగులో ఉన్నాయని గత రెండు సంవత్సరాలుగా పరిష్కారానికి నోచుకోక ఎక్కడ వేసిన గొంగల్లా అక్కడే పడి ఉన్నాయని ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ అంశాలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కారం చేయాలని ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ పశ్చిమ కృష్ణ జిల్లా అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ కోరారు . జగ్గయ్యపేట ఎన్జీవో హోమ్ లో శనివారం జరిగిన …

Read More »

డిసెంబర్ 3న జగ్గయ్యపేట ఎన్జీవోస్ ఎన్నికలు

జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ ఎన్టీవోస్ అసోసియేషన్ జగ్గయ్యపేట ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలకు నిర్వహించుటకు జిల్లా సహద్యకుడు సిహెచ్ శ్రీరామ్ ను ఎన్నికల అధికారిగా, జిల్లా సంయుక్త కార్యదర్శి బివివిఆర్ నాగేంద్రరావును సహాయ ఎన్నికల అధికారిగా, జిల్లా ఉపాధ్యక్షుడు యం రాజుబాబును ఎన్నికల పరిశీలకులుగా జిల్లా అధ్యక్షుడు ఎ విద్యా సాగర్ నియమించడం జరిగింది. ఎన్నికల అధికారి సిహెచ్ శ్రీరామ్ మాట్లాడుతూ జగ్గయ్యపేట తాలూకా పరిధిలో 172 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. అధ్యక్ష కార్యదర్శితో పాటు మరో తొమ్మిది పదవులు …

Read More »