-యువతలో నైపుణ్యాభివృద్ధికి.. పీఎం ఇంటర్న్షిప్ పథకం -డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్. Dr.S.వెంకటేశ్వర్, ఐఏఎస్, తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాన మంత్రి ఇంటర్న్షిప్ ద్వారా రాబోయే 5 సంవత్సరాల్లో దేశంలోని టాప్ 500 కంపెనీలలో కోటి మంది యువతకు ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్ ప్రారంభమైందని డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ Dr.S. వెంకటేశ్వవార్, ఐ.ఏ.ఎస్, తెలియజేశారు. దేశవ్యాప్తంగా యువతకు ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల్లో నైపుణ్యపరమైన శిక్షణతో …
Read More »Monthly Archives: January 2025
ముమ్మరంగా జరుగుతున్న రిజిస్ట్రేషన్ల ప్రక్రియ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల నూతన భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ నందు జరుగుతున్న బీఫామ్ పట్ట రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముమ్మరం గా జరుగుతోందని ఇన్చార్జ్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ అన్నారు. పాయికాపురం, కొత్త రాజరాజేశ్వరి పేట లో 10 సంవత్సరాలు నిండిన ఇంటి యజమానులకు బి ఫాం పట్టాను పక్క రిజిస్ట్రేషన్ చేసేందుకు విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో జరుగుతున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముమ్మరంగా జరుగుతుందని, ఇంకాను రిజిస్ట్రేషన్ జరగవలసినవి 1171 …
Read More »ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందిన 12 ఫిర్యాదులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యలను నిత్యం పరిష్కరించే దిశగా జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ నందు సోమవారం ఉదయం ఇంచార్జి కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ నిర్వహించారు. ఈ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అధికారులు 12 ఫిర్యాదులు అందుకున్నారు. కమిషనర్ ఆదేశాల మేరకు అధికారులు స్వీకరించిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరిస్తామని ఫిర్యాదులు అందించిన ప్రజలతో అన్నారు. ఈ సోమవారం జరిగిన ప్రజా …
Read More »ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నమోదయ్యే ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలి…
పామర్రు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నమోదయ్యే ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసెల్ సిస్టం) కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, స్థానిక శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా తో కలిసి పామర్రు తాహసిల్దార్ కార్యాలయంలో ప్రజల నుండి స్వయంగా అర్జీలు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారంలో …
Read More »ప్రకృతి వైపరీత్యాలను సైతం తట్టుకునే పంట ఆయిల్ పామ్
-సాగు పట్ల రైతులకు అవగాహన కార్యక్రమాలు -జిల్లా కలెక్టర్ మొవ్వ/పమిడిముక్కల, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకృతి వైపరీత్యాలను సైతం తట్టుకుని రైతులకు లాభాలను ఇచ్చే పంట ఆయిల్ పామ్ సాగు అని, ఆ సాగు వైపు రైతులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన స్థానిక శాసనసభ్యుడు వర్ల కుమార్ రాజాతో కలిసి పామర్రు నియోజకవర్గంలోని మొవ్వ, పమిడిముక్కల మండలాల్లో పర్యటించి ఆయిల్ పామ్ మొక్కల నర్సరీ, పంట సాగును క్షేత్రస్థాయిలో సందర్శించారు. మొవ్వ మండలములోని కొండవరం …
Read More »ప్రజా సమస్యల పరిష్కార వేదిక “మీకోసం”
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదిక “మీకోసం” లో వచ్చిన అర్జీల పరిష్కారంలో గడువు దాటిన అర్జీలపై, పెండింగ్ కోర్టు కేసులపై దృష్టి సారించాలని జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ సోమవారం కలెక్టరేట్లో మీకోసం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసంలో పెండింగ్ అర్జీలపై జాయింట్ కలెక్టర్ సమీక్షిస్తూ గడువు దాటేదాకా ఉండకూడదని, గడువులోగానే అర్జీలు పరిష్కరించాలన్నారు. వివిధ శాఖలలో పెండింగ్ కోర్టు కేసులు సమీక్షిస్తూ …
Read More »ఎపీకి ఇచ్చిన నిధుల వివరాలతో అమిత్షా శ్వేతపత్రం విడుదల చేయాలి
-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గత 6 నెలల కాలంలో ఎపీకి రూ.3 లక్షల కోట్లు ఇచ్చామని అబద్ధాలు చెబుతున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమగ్ర వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు కె.రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. ఎపీకి గత 6 నెలల కాలంలో రూ.3 లక్షల కోట్లు సహాయం చేసిందంటూ కేంద్ర హోంమంత్రి అమిత్షా అబద్ధాలు చెప్పడం తగదు. రూ.3 …
Read More »“పశు ఆరోగ్య శిబిరాలు”
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : పశుసంవర్థకశాఖ, గుంటూరు జిల్లాలో వున్న 18 మండలాల్లోని అన్నీ గ్రామాల్లో పశుఆరోగ్య శిబిరాలు ఈ నెల 20-01-2025 నుండి 31-01-2025 వరకు జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకము సౌజన్యంతో నిర్వహిస్తున్నారు, ఈ శిబిరాలల్లో ఉచిత పశు ఆరోగ్య పరీక్షలు, తేలికపాటి శస్త్రచికిత్సలు, ఎదకు రాని, చూలు కట్టని మరియు ఇతర కర్భకోశ వ్యాధులకు పరీక్షలు నిర్వహించి, తగు వైద్యం అందించడం, పశువులకు, దూడలకు మరియు సన్నజీవాలకు నట్టల నివారణ మందు, పశువులకు మరియు కోళ్లకు వ్యాధినిరోధక టీకాలు …
Read More »సోమవారం డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక…
-కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 20వ తేది సోమవారం గుంటూరు నగర ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి ఉదయం 9:30 నుండి 10:30 గంటల వరకు గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ చాంబర్ లో డయల్ యువర్ కమిషనర్ (0863-2224202) కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అనంతరం “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం ద్వారా కౌన్సిల్ సమావేశ మందిరంలో మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుండి నేరుగా అర్జీలు, …
Read More »అనధికార కుళాయిల తొలగింపుపై ఇంజినీరింగ్, రెవెన్యూ సిబ్బంది ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో వార్డ్ సచివాలయాల వారీగా అనధికార కుళాయిల తొలగింపుపై ఇంజినీరింగ్, రెవెన్యూ సిబ్బంది ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. ఆదివారం కమిషనర్ గారు శ్యామలనగర్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, బ్రాడీపేట, లక్ష్మీపురం, పెద్దపలకలూరు రోడ్ ప్రాంతాల్లో పారిశుధ్యం, అభివృద్ధి పనులను, గుజ్జనగుండ్ల సెంటర్ లో వెండింగ్ జోన్ ప్రతిపాదిత ప్రాంతాలను పరిశీలించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత శ్యామలా నగర్ లో …
Read More »
Prajavartha Online Telugu News